తెలంగాణ సీఎం కెసీఆర్ సంతకం ఫోర్జరీ
BY Telugu Gateway18 May 2019 1:45 PM GMT
X
Telugu Gateway18 May 2019 1:45 PM GMT
వాళ్లు ఏకంగా సాక్ష్యాత్తూ తెలంగాణ ముఖ్యమంత్రి కెసీఆర్ సంతకమే ఫోర్జరీ చేశారు. చివరకు పోలీసుల చేతికి చిక్కారు. సీఎం కేసీఆర్ సంతకం ఫోర్జరీ చేసి నకిలీ ధృవపత్రాలు సృష్టించిన ముగ్గురిని రాయదుర్గం పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ ఘటనకు సంబంధించి మాదాపూర్ డీసీపీ వెంకటేశ్వరరావు మీడియాకు వివరించారు.ఆర్డీఓ ఫిర్యాదు మేరకు నిందితులను అదుపులోకి తీసుకున్నామని చెప్పారు.
శేరిలింగంపల్లి మండలం గచ్చిబౌలి సర్వే నెంబర్ 44/పీలో 2 ఎకరాల భూమికి రెగ్యులరైజేషన్ చేయాలని ముఖ్యమంత్రి లెటర్ హెడ్తో ఉన్న కాపీని రెవెన్యూ డిపార్ట్ మెంట్కు నిందితులు పంపించారని తెలిపారు. లెటర్ హెడ్లను యాకుత్పురాకు చెందిన టీఆర్ఎస్ లీడర్ నుంచి రూ.45 వేలకు నిందితుల్లో ఒకడైన మహమ్మద్ ఉస్మాన్ ఖురేషి కొనుగోలు చేశాడని వెల్లడించారు.
Next Story