Telugu Gateway
Politics

ఫలితాల వీక్షణకు ‘ప్రత్యేక ఏర్పాట్లు’

ఫలితాల వీక్షణకు ‘ప్రత్యేక ఏర్పాట్లు’
X

అత్యంత ఉత్కంఠ రేపుతున్న ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఫలితాల వీక్షణకు చాలా మంది నేతలు..అభిమానులు..కార్యకర్తలు ‘ప్రత్యేక ఏర్పాట్లు’ చేసుకుంటున్నారు. ఏపీలోని పలు ప్రాంతాల్లో ఎవరికి అందుబాటులో ఉన్న గెస్ట్ హౌస్ ల్లో దీని కోసం ఏర్పాట్లు సాగుతున్నాయి. కొంత మంది ఖరీదైన హోటళ్లలో రూమ్ లు బుక్ చేసుకుని విజయవాడలోనే ఫలితాలు చూసేందుకు ఏర్పాట్లు చేసుకున్నారు. హైదరాబాద్ లో నివాసం ఉంటున్న చాలా మంది ఏపీకి చెందిన పారిశ్రామికవేత్తలు..రాజకీయాలపై ఆసక్తి ఉన్న వారు కూడా బుధవారం సాయంత్రానికి విజయవాడకు చేరుకుని ఫలితాల కోసం రెడీ కానున్నారు.

వైసీపీతోపాటు..టీడీపీ అభిమానులు కూడా విజయవాడ కేంద్రంగానే ప్రత్యేక ఏర్పాట్ల చేసుకుంటున్నారు. ఫలితాల వెల్లడి అనంతరం తమ తమ అభిమాన నేతల ఇళ్ళకు లేదా పార్టీ కార్యాలయాలకు చేరుకుని అభినందనలు తెలిపేలా ఈ ఏర్పాట్లు ఉన్నాయి. సో..గురువారం నాడు విజయవాడలో హంగామా ఉండబోతుంది. పోటీ చేసిన అభ్యర్ధులు మినహా పలు జిల్లాలకు చెందిన నేతలు అందరూ కూడా విజయవాడ చేరుకుంటున్నారు. ఇందులో వైసీపీతోపాటు..టీడీపీ నేతలు కూడా ఉన్నారు.

Next Story
Share it