Telugu Gateway
Telangana

శివాజీ...‘ఆపరేషన్ అలంద’ మిస్ అయిందే!

శివాజీ...‘ఆపరేషన్ అలంద’ మిస్ అయిందే!
X

టీవీ9 తాజా ఎపిసోడ్ తో యాక్టర్ శివాజీపై సోషల్ మీడియా వేదికగా జోకులు పేలుతున్నాయి. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడిపై ఎవరెవరు..ఎక్కడెక్కడ ఎలా కుట్రలు చేస్తున్నారో ఆ రాష్ట్ర ఇంటెలిజెన్స్ కంటే ఫర్పెక్ట్ గా కనిపెట్టి..మీడియా ముందు పెట్టి చంద్రబాబు దగ్గర వందకు వంద మార్కులు కొట్టేశారు నటుడు శివాజీ. అందుకే ఇప్పుడు ఆయన సోషల్ మీడియా టార్గెట్ అయ్యారు. ‘ఆపరేషన్ గరుడ గురించి కనిపెట్టిన శివాజీకి ‘ఆపరేషన్ అలంద’ ఎందుకు తెలియలేదు’ అంటూ వ్యాఖ్యలు చేస్తున్నారు. టీవీ9ను కొనుగోలు చేసిన కొత్త యాజమాన్యం శివాజీతో కలసి ఇప్పటి వరకూ సీఈవో గా ఉన్న రవిప్రకాష్ కుట్ర చేశారని ఆరోపిస్తోంది. రవిప్రకాష్ కు చెందిన షేర్లను ఉద్దేశపూర్వకంగానే శివాజీకి బదలాయించినట్లు చూపించి..ఆయనతో ఎన్ సీఎల్ టీలో కేసు వేయించారనేది నూతన యాజమాన్యం ఆరోపణ. ఒకప్పుడు తెలుగుదేశం అధినేత, ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడిపై తీవ్ర స్థాయిలో అవినీతి ఆరోపణలు, విమర్శలు చేసిన శివాజీ తర్వాత కాలంలో టీడీపీకి బాగా దగ్గరైన విషయం తెలిసిందే.

ముఖ్యంగా టీవీ9తోపాటు మరికొన్ని ఛానళ్లలో ఆయనకు ఎక్కడలేని ప్రాధాన్యత దక్కేది. చంద్రబాబుకు సంబంధించిన అంశాలు చీమ చిటుక్కుమంటే తెలుసుకోగలిగిన శివాజీ తన సొంత విషయానికి వచ్చేసరికి కనుక్కోవాల్సిన ‘గరుడ’ను ఎక్కడకు పంపినట్లో?!. తనపైన, తన మిత్రుడు రవిప్రకాష్ పైనా ఇలా కేసులు పడతాయని ఆయన ఊహించలేదా?. నూతన యాజమాన్యం గురువారం నాడు టీవీ9 సీఈవోగా రవిప్రకాష్ ను బాధ్యతల నుంచి తప్పించటంతోపాటు ఆయనపై వివిధ సెక్షన్ల కింద కేసులు పెట్టింది. ఈ వ్యవహారం రాబోయే రోజుల్లో ఎన్ని మలుపులు తిరుగుతుందో వేచిచూడాల్సిందే.

Next Story
Share it