Telugu Gateway
Politics

ఏపీలో సైకిలెక్కారు...తెలంగాణలో కారెక్కారు

ఏపీలో సైకిలెక్కారు...తెలంగాణలో కారెక్కారు
X

లోటు బడ్జెట్ లో ఉంది కాబట్టి ఏపీ ప్రజలు సైకిలెక్కారు. మిగులు బడ్జెట్ తో ఉంది కాబట్టి తెలంగాణ ప్రజలు కారెక్కారు. ఇదీ మాజీ ఎంపీ లగడపాటి రాజగోపాల్ ఎన్నికల ఫలితాలకు సంబంధించి ఇచ్చిన సంకేతాలు. ఏపీ అసెంబ్లీ, లోక్ సభ ఎన్నికల్లో టీడీపీకి మెజారిటీ సీట్లు వచ్చే అవకాశం ఉందని..తెలంగాణలో టీఆర్ఎస్ కు ఎక్కువ సీట్లు వచ్చే అవకాశం ఉందని సంకేతాలు ఇచ్చారు. ఎగ్జిట్ పోల్ ఫలితాలు..లెక్కలు అన్నీ ఆదివారం సాయంత్రం ఆరు గంటల తర్వాత చెబుతానని అన్నారు. అయితే రాజధాని ప్రాంతంలో రైతులకు మాత్రం చెవిలో ఎగ్జిట్ పోల్ ఫలితాలు వెల్లడించినట్లు తెలిపారు. మాజీ ఎంపీ లగడపాటి రాజగోపాల్ ఎన్నికల ఫలితాలకు సంబంధించిన అంశాలపై శనివారం నాడు విజయవాడలో మీడియాతో మాట్లాడారు.

ప్రతిసారి తాను వేసే అంచనాలు నిజం కావాలని ఏమీ లేదన్నారు. కొన్నిసార్లు అంచనాలు తప్పిపోవచ్చన్నారు. కేంద్రంలో ఏ కూటమికి కూడా స్పష్టమైన మెజారిటీ మాత్రం రాదన్నారు. ఏపీలో హంగ్ పరిస్థితి ఉండదని అధికారంలోకి వచ్చే పార్టీ సంపూర్ణ మెజారిటీతోనే వస్తుందని పేర్కొన్నారు. తమ టీమ్ ప్రజల నాడి తెలుసుకునే ప్రయత్నం చేసిందని..పక్కా లెక్కలు రేపు తన చేతికి వస్తాయన్నారు. అమరావతిలో కొత్త అసెంబ్లీ, సచివాలయం ఇంద్రప్రస్థానికి ఏ మాత్రం తీసిపోని విధంగా రాబోతోందని లగడపాటి తెలిపారు.

Next Story
Share it