Telugu Gateway
Top Stories

విమానంలో మంటలు..41 మంది మృతి

విమానంలో మంటలు..41 మంది మృతి
X

టేకాఫ్ అయిన కొద్దిసేపటికే విమానంలో సాంకేతిక లోపం. అంతే వేగంగా ల్యాండింగ్ కు ప్రయత్నం. ఆ ప్రయత్నంలో రన్ వేకు గట్టిగా తాకటంతో విమానం వెనక భాగంలో పెద్ద ఎత్తున మంటలు వచ్చాయి. ఈ ఘటనలో ఏకంగా 41 మంది ప్రయాణికులకు మృత్యువాత పడ్డారు. ఇందులో ఇద్దరు చిన్నారులు కూడా ఉన్నట్లు సమాచారం. తొలుత విమాన వెనకభాగంలో పిడుగు పడిందనే వార్తలు వచ్చాయి. ఈ కారణంగానే మంటలు వచ్చాయని భావించారు.

కానీ తర్వాత మాత్రం ఇది సాంకేతిక సమస్య కారణంగా చెబుతున్నారు. ఈ ఘటనపై విచారణ సాగుతోంది. రష్యా రాజధాని మాస్కోలో విమానం అత్యవసరంగా ల్యాండ్‌ చేయాల్సి రావటంతో ఈ ప్రమాదం జరిగింది. ఈ విమానంలో సిబ్బందితో పాటు 78 మంది ప్రయాణిస్తున్నారు. ఎరోప్లాట్ సుఖోయ్ సూపర్ జెట్ విమానం ప్రమాదానికి గురైంది. ప్రమాదం రష్యా ప్రభుత్వం దర్యాప్తు కమిటీని నియమించింది.

Next Story
Share it