శ్రీలంకలో రాధిక ‘ఎస్కేప్’
సినీ నటి రాధిక శ్రీలంక బాంబు పేలుళ్ళ నుంచి తృటిలో తప్పించుకున్నారు. ఆమె కొలంబోలోని సిన్నామన్ హోటల్ నుంచి బయటకు వచ్చిన కొద్ది సేపటికే అక్కడ బాంబు పేలుళ్ళు చోటుచేసుకున్నాయి. ఈ ఘటనలో చాలా మంది ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే. విషయం తెలుసుకున్న రాధికా శరత్ కుమార్ ట్విట్టర్ ద్వారా స్పందించారు. ‘ ఓ మై గాడ్. పేలుళ్ల గురించి విని షాకయ్యాను. పేలుళ్లకు కొద్ది నిమిషాల ముందు నేను అక్కడే బస చేశా. అక్కడ బాంబు పేలుళ్లు జరిగియాంటే ఇప్పటికి నమ్మలేకపోతున్నాను.
దేవుడు అందరితో ఉండాలని కోరుకుంటున్నా’ అని ట్విట్ చేశారు. సిన్నామన్ గ్రాండ్ హోటల్లో బస చేసిన రాధిక.. పేలుళ్లు సంభవించడానికి కొద్ది నిమిషాల ముందే హోటల్ను ఖాళీ చేశారు. ఈస్టర్ పండుగ సందర్భంగా ప్రత్యేక ప్రార్ధనలలో పాల్గొన్న భక్తులను లక్ష్యంగా పెట్టుకొని ఉగ్రవాదులు ఈ దాడులకు పాల్పడ్డారు. కొలంబోలో కొచ్చికాడోలోని సెయింట్ ఆంథోనీ చర్చిలో, కథువాపితియాలోని కటానా చర్చిలో ఈ పేలుళ్లు చోటుచేసుకున్నాయి. షాంగ్రి లా హోటల్, కింగ్స్ బరీ హోటల్లో కూడా బాంబుపేలుడు సంభవించినట్టు పోలీసులు గుర్తించారు.