Telugu Gateway
Politics

నాకు ఓపిక నశించింది..ఆ నా కొడుకులను తన్నండి

నాకు ఓపిక నశించింది..ఆ నా కొడుకులను తన్నండి
X

సీఎం చంద్రబాబునాయుడి తనయుడు, మంత్రి నారా లోకేష్ మీడియా సాక్షిగా అడ్డంగా బుక్కయ్యారు. ఎన్నికల ప్రచారంలో తీవ్ర స్థాయిలో అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారు. ప్రజలు అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పలేక ‘నాకు ఇంక ఓపిక నశించింది. ప్రతిపక్షం ఉన్నదే ప్రభుత్వంపై బుదర చల్లడానికి. ప్రతిపక్షం బురదచల్లి పారిపోతే.. వాటిని నేను తుడుచుకుంటూ కూర్చోవాలా? ఏం పనిలేదా నాకు?.

అందుకే వాళ్లను తన్నమంటున్నాను కదా. పోలీసు సోదరులకు కూడా నేను చెబుతున్నా. తంతే మీ జోలికి రారు. ఆ నా కొడుకులను తన్నాలి. లేకపోతే ఆ నా కొడుకులు ఇక్కడకు వచ్చి పుకార్లు లేపుతారు. వారి ఇంకే పని లేదా? అంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యలు విన్న ప్రజలే అవాక్కు అయ్యారు. మంగళగిరి నియోజకవర్గం తాడేపల్లి మున్సిపాలిటీ పరిధిలోని బ్రహ్మానందపురంలో ఎన్నికల ప్రచారం సందర్భంగా ఈ ఘటన చోటుచేసుకుంది.

Next Story
Share it