ఏపీలో లక్ష్మీస్ ఎన్టీఆర్ విడుదల లేనట్లే!
BY Telugu Gateway30 April 2019 11:06 AM GMT
X
Telugu Gateway30 April 2019 11:06 AM GMT
దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ఆశలపై ఎన్నికల కమిషన్ మరోసారి నీళ్ళు చల్లింది. మే1న ఈ సినిమాను ఏపీలో విడుదల చేసేందుకు అంతా రంగం సిద్ధం చేసుకున్నారు. అయితే ఎన్నికల కమిషన్ మాత్రం సినిమా విడుదలకు బ్రేకులు వేసింది. దీంతో చిత్ర యూనిట్ చెప్పినట్లుగా ఏపీలో సినిమా విడుదల అయ్యే ఛాన్స్ లేదు. మే1న లక్ష్మిస్ ఎన్జీఆర్ సినిమా విడుదలకు అనుమతి ఇవ్వాలని ఈ నెల 25 న సిఈవో గోపాలకృష్ణ ద్వివేదికి లేఖ రాశారు.
రాంగోపాల్ వర్మ లేఖ కు ఏపీ సీఈవో ద్వివేదీ సమాధానం ఇస్తూ స్పష్టమై ఆదేశాలు జారీ చేశారు. ఏప్రిల్ 10 తేదిన కేంద్ర ఎన్నికల సంఘం దేశవ్యాప్తంగా బయోపిక్ లపై నిషేదం విదిస్తూ సిఈసీ ఉత్తర్వులు జారీ చేసింది.అ ఉత్తర్వులకు కట్టుబడి ఉండాలని రాంగోపాల్ వర్మకు రాసిన లేఖలో పేర్కోన్నారు సిఇవో ద్వివేది. దీంతో మరోసారి సినిమాకు బ్రేక్ పడినట్లు అయింది.
Next Story