Telugu Gateway
Telangana

ఫిరాయింపు ఎమ్మెల్యేలపై చట్టపరంగా చర్యలు

ఫిరాయింపు ఎమ్మెల్యేలపై చట్టపరంగా చర్యలు
X

అధికార టీఆర్ఎస్ పార్టీలోకి ఫిరాయించిన కాంగ్రెస్ ఎమ్మెల్యేలకు ఇది షాక్ లాంటి వార్తే. టీఆర్ఎస్ లో సిఎల్పీ విలీనాన్ని అడ్డుకోవాలంటూ ప్రతిపక్ష నేత మల్లు భట్టి విక్రమార్క, టీపీపీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి వేసిన పిటీషన్ హైకోర్టులో మంగళవారం నాడు విచారణకు వచ్చింది. అయితే అత్యవసరంగా ఈ పిటిషన్‌పై విచారణ అవసరం లేదని కోర్టు అభిప్రాయపడింది. టీఆర్ఎస్‌లోకి వెళ్లిన ఎమ్మెల్యేలపై చట్టపరమైన చర్యలు ఉంటాయని హైకోర్టు స్పష్టం చేసింది.

కాంగ్రెస్ నేతలు ఉత్తమ్‌కుమార్ రెడ్డి, భట్టి విక్రమార్క దాఖలు చేసిన పిటిషన్‌పై విచారణ సందర్భంగా హైకోర్టు ఈ వ్యాఖ్యలు చేసింది. తదుపరి విచారణ జూన్‌ 11కు వాయిదా వేస్తున్నట్లు హైకోర్టు వెల్లడించింది. ఫిరాయింపులపై తాము ఇచ్చిన ఫిర్యాదులపై చర్యలు తీసుకున్న తర్వాతే విలీనంపై నిర్ణయం ఉండేలా చూడాలని కాంగ్రెస్ నేతలు కోర్టును అభ్యర్ధించారు. కోర్టు వ్యాఖ్యల నేపథ్యంలో మరి కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఎలాంటి వైఖరి అనుసరిస్తారో వేచిచూడాల్సిందే.

Next Story
Share it