Telugu Gateway
Politics

వైసీపీలోకి బిజ్జం పార్ధసారధిరెడ్డి

వైసీపీలోకి బిజ్జం పార్ధసారధిరెడ్డి
X

గతంలో ఎన్నడూలేని రీతిలో ఈ సారి ప్రధాన ప్రతిపక్షం అయిన వైసీపీలోకి ‘రికార్డు’ చేరికలు నమోదు అయ్యాయి. వచ్చే ఎన్నికల్లో గెలుపుపై ధీమాతోనే ఎక్కువ మంది నేతలు వైసీపీ చూస్తున్నారనే అభిప్రాయం రాజకీయ వర్గాల్లో నెలకొంది. ఇంకా ఎన్నికలకు పట్టుమని వారం రోజులు కూడా లేని సమయంలో కూడా ఇంకా చేరికలు కొనసాగుతూనే ఉన్నాయి. కర్నూలు జిల్లా పాణ్యం మాజీ ఎమ్మెల్యే బిజ్జం పార్థసారధి రెడ్డి గురువారం వైఎస్సార్‌సీపీలో చేరారు. నంద్యాల సభలో పార్థసారధి రెడ్డికి వైఎస్‌ జగన్‌ పార్టీ కండువా కప్పి సాదరంగా ఆహ్వానించారు.

శ్రీశైలం నియోజకవర్గానికి చెందిన వెలుగోడు మండల జెడ్పీటీసీ లాల్‌స్వామి, డాక్టర్‌ రవికృష్ణ తదితరులు కూడా వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీలో చేరారు. హిందూపురం మాజీ ఎంపీ నిజాముద్దీన్‌ కూడా వైసీపీలో చేరారు. వైసీపీలో చేరిన తర్వాత నిజాముద్దీన్‌ మాట్లాడుతూ.. తనకు ఎలాంటి అనుభవం లేకపోయినా తనను నమ్మి ఎంపీగా అవకాశం ఇచ్చిన వైఎస్ రాజశేఖరరెడ్డి రుణం తీర్చుకోవడానికి వైఎస్సార్‌సీపీలో చేరినట్టు చెప్పారు. వైఎస్సార్‌ ప్రవేశపెట్టిన సంక్షేమ కార్యక్రమాలు ఇంకా ప్రజల గుండెల్లో నిలిచిపోయాయని చెప్పారు.

Next Story
Share it