Telugu Gateway
Politics

ఏపీలో పలు చోట్ల ఈవీఎంల సమస్య

ఏపీలో పలు చోట్ల ఈవీఎంల సమస్య
X

నువ్వా..నేనా అన్న రీతిలో అత్యంత ఉత్కంఠ భరితంగా ఉన్న ఏపీ అసెంబ్లీ ఎన్నికల పోరులో ఈవీఎంలు మొరాయిస్తున్నాయి. ఈ పరిణామం అటు అధికార టీడీపీతోపాటు ఇటు ప్రతిపక్ష వైసీపీని కూడా చికాకుకు గురిచేస్తోంది. పలు జిల్లాల్లో ఈవీఎంలు మొరాయిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. దీంతో ముందే ఓటు వేద్దామని పోలింగ్ బూత్ లకు వచ్చిన వారికి నిరాశే ఎదురవుతోంది. కొంత మంది క్యూలైన్లు ముందుకు సాగకపోవటంతో వెనక్కి తిరిగి వెళ్ళిపోతున్నారు.

ఈ పరిణామాలు ఏమైనా ఓటింగ్ శాతంపై ప్రభావం చూపిస్తాయా? అన్న ఆందోళనలో పార్టీలు ఉన్నాయి. సాక్ష్యాత్తూ ఏపీ ముఖ్య ఎన్నికల అధికారి గోపాలకృష్ణ ద్వివేది ఓటు వేయటానికి వెళ్ళిన బూత్ లోనూ ఈవీఎంలు మొరాయించటం విశేషం. పలు చోట్ల చెదురుమదురు సంఘటనలు తప్ప..గురువారం ఉదయం నుంచి సాఫీగానే పోలింగ్ సాగుతోంది. పోలింగ్ ప్రారంభం అయిన కొద్దిసేపటికే ఏపీలో ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు, ప్రతిపక్ష నేత జగన్ లు తమ తమ నియోజకవర్గాల్లో ఓటు హక్కు వినియోగించుకున్నారు.

Next Story
Share it