వైసీపీలో చేరిన జయసుధ
ప్రముఖ నటి, మాజీ ఎమ్మెల్యే జయసుధ టీడీపీకి గుడ్ బై చెప్పేశారు. అంతే కాదు..ఆమె వైసీపీలో చేరారు. గురువారం నాడు హైదరాబాద్ లో జగన్ సమక్షంలో పార్టీలో చేరారు. జయసుధకు వైసీపీ కండువా కప్పి ఆమెను జగన్ పార్టీలోకి స్వాగతించారు. తర్వాత ఆమె మీడియాతో మాట్లాడుతూ... తాను రాజకీయాల్లోకి రావడానికి దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి కారణం అని తెలిపారు. వైఎస్సార్ సీపీలోకి రావడం మళ్లీ సొంత ఇంటికి వచ్చినట్లు ఉందని వ్యాఖ్యానించారు.
వైఎస్ జగన్మోహన్రెడ్డి ముఖ్యమంత్రి కావడం ఖాయమని, ప్రస్తుతానికి ఎన్నికలలో పోటీ చేసే ఆలోచన లేదు. అయితే పార్టీ అధ్యక్షుడు ఆదేశాల మేరకు నడుచుకుంటా. ఒకవేళ పార్టీ ఆదేశిస్తే ఎన్నికల్లో పోటీ చేస్తా. పార్టీలో ఉండి గెలుపు కోసం కృషి చేస్తా. అప్పట్లో ఎంతోమంది ఎన్నికల్లో పోటీ ఉన్నా సికింద్రాబాద్ ఎమ్మెల్యేగా నన్ను వైఎస్సార్ నిలబెట్టారు. పార్టీలో చేరడం నాకు ఎంతో సంతోషంగా ఉంది. ఎవరైనా సరే సినిమా వాళ్ల గురించి తక్కువ చేసి మాట్లాడకూడుదు. వృత్తి వేరు ప్రవృత్తి వేరు.’ అని అన్నారు.