Telugu Gateway
Politics

దేవినేని ఉమకు షాక్

దేవినేని ఉమకు షాక్
X

ఏపీ నీటిపారుదల శాఖ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావుకు ఎన్నికల ముందు ఊహించని షాక్. ఉమా సోదరుడు దేవినేని చంద్రశేఖర్ టీడీపీకి గుడ్ బై చెప్పి ప్రతిపక్ష నేత జగన్మోహన్ రెడ్డి సమక్షంలో వైసీపీలో చేరారు. వైసీపీ తరపున మైలవరం నుంచి బరిలో దిగనున్న వసంత కృష్ణ ప్రసాద్ మంత్రి సోదరుడిని జగన్ వద్దకు తీసుకెళ్ళారు. వైసీపీలో చేరిన అనంతరం దేవినేని చంద్రశేఖర్ మీడియాతో మాట్లాడుతూ సంచలన వ్యాఖ్యలు చేశారు.

పలు కారణాల వల్ల తాను పార్టీ మారినట్లు తెలిపారు. ఏపీలో అధికార పార్టీ దోపిడీ దారుణంగా ఉందన్నారు. పోలవరంతో పాటు సాగునీటి ప్రాజెక్టుల్లో కుంభకోణాలు సాగుతున్నాయని తెలిపారు. అవినీతి కేసుల ననుంచి మంత్రి బయటపడలేరని ఆయన సోదరుడే వ్యాఖ్యానించటం టీడీపీ వర్గాల్లో కలకలం రేపుతోంది. మంత్రి ఉమా ఓ వైపు ప్రతిపక్ష నేత జగన్మోహన్ రెడ్డిపై తీవ్ర స్థాయిలో విమర్శలు చేస్తుంటే ఆయన సోదరుడు అదే పార్టీలో చేరటం టీడీపీని ఇరకాటానికి గురిచేస్తోందనే చెప్పొచ్చు.

Next Story
Share it