Telugu Gateway
Telangana

తెలంగాణ కొత్త మంత్రివర్గం వచ్చేసింది

తెలంగాణ కొత్త మంత్రివర్గం వచ్చేసింది
X

తెలంగాణలో కొత్త ప్రభుత్వం ఏర్పడిన రెండు నెలల తర్వాత నూతన మంత్రివర్గం కొలువుదీరింది. మంగళవారం ఉదయం 11.35 గంటల సమయంలో రాజ్ భవన్ లో జరిగిన కార్యక్రమంలో గవర్నర్ నరసింహన్ పది మంది మంత్రులతో ప్రమాణ స్వీకారం చేయించారు. సీఎం కెసీఆర్ ఆదేశాల మేరకు అధికారులు సోమవారం రాత్రే మంత్రివర్గంలోకి తీసుకోనున్న సభ్యులందరికీ ఫోన్లు చేసి మరీ సమాచారం అందజేసిన విషయం తెలిసిందే. ఈ కార్యక్రమానికి టీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌, మాజీ మంత్రి హరీష్ రావుతో పాటు పలువురు మాజీ మంత్రులు పాల్గొన్నారు.

ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్‌కే జోషి ఒక్కొక్కరిని సభా వేదికపైకి పిలిచారు. తొలుత ఇంద్రకరణ్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేయగా..చివర్లో మల్లారెడ్డి ప్రమాణ స్వీకారం చేశారు. కొత్తగా ప్రమాణ స్వీకారం చేసిన వారిలో ఈటెల రాజేందర్, తలసాని శ్రీనివాసయాదవ్, జగదీష్ రెడ్డి, సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి, కొప్పులు ఈశ్వర్, శ్రీనివాసగౌడ్, ఎర్రబెల్లి దయాకర్ రావు, వేముల ప్రశాంత్ రెడ్డి ఉన్నారు. ఇప్పటికే సీఎంతో పాటు మంత్రివర్గంలో హోం మంత్రి మహమూద్ అలీ ఉన్న విషయం తెలిసిందే.

Next Story
Share it