Telugu Gateway
Politics

కేరళలో టెన్షన్ టెన్షన్

కేరళలో టెన్షన్ టెన్షన్
X

కేరళలో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. బుధవారం తెల్లవారు జామున శబరిమల ఆలయంలోకి ఇద్దరు మహిళల ప్రవేశం కేరళలో ఉద్రిక్తత రాజేసింది. ఆలయ నిబంధనలు, ఆచారాలు మంటకలిశాయని, కేరళలోని కమ్యూనిస్టు ప్రభుత్వమే దీనికి కారణమంటూ ఆందోళనలు పెల్లుబిగిస్తున్నాయి. కేరళ బంద్‌కు పిలుపునిచ్చిన యూడిఎఫ్‌ పక్షాలకు బీజేపీ, అన్ని వర్గాల అయ్యప్ప సంఘాలు మద్దతు పలికాయి. బంద్ ప్రబావంతో కేరళ స్తంభించింది. ఆందోళన బాట పట్టిన బీజేపీ, హిందూ సంస్థల కార్యకర్తలు హంగామా చేస్తున్నారు. కోయంబత్తూరు- పాలక్కాడు, నాగర్ కోయిల్- ట్రివేండ్రం సరిహద్దులు మూసివేయటంతో ఇరువైపుల రవాణా బంద్ స్తంభించింది.

ఇరువైపుల బారీ సంఖ్యలో‌ పోలీసు బలగాలను మోహరించి పరిస్థితిని సమీక్షిస్తున్నారు. దీంతో శబరిమల వెళ్లే అయ్యప్ప భక్తులు తీవ్రస్థాయిలో ఇబ్బందులు పడుతున్నారు. కేరళ వైపు వెళ్లే బస్సులను కోయంబత్తూరు, నాగర్ కోయిల్ లొనే నిలిపివేయటంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కేరళలో బంద్ ప్రబావం తీవ్రంగా ఉండటంతో ఎప్పుడు ఎలాంటి సంఘటనలు జరుగుతాయోనన్న టెన్షన్ నెలకొంది. కేరళలో భారీ ఎత్తున బస్సుల విధ్వంసం సాగుతోంది. అదే సమయంలో కమ్యూనిస్టుల కార్యాలయాలపై రాళ్ళ దాడులు కూడా జరిగాయి. ఇదిలా ఉంటే ఇద్దరు మహిళల ప్రవేశం తర్వాత ఆలయాన్ని కొద్దిసేపు మూసివేసి శుద్ధిచేసిన ప్రధాన పూజారిపై సుప్రీంకోర్టులో కోర్టు ధిక్కార పిటీషన్ దాఖలైంది.

Next Story
Share it