Telugu Gateway
Cinema

‘ఎన్టీఆర్’ బయోపిక్ కు ‘క్లీన్ యూ’ సర్టిఫికెట్

‘ఎన్టీఆర్’ బయోపిక్ కు ‘క్లీన్ యూ’ సర్టిఫికెట్
X

భారీ అంచనాల మధ్య విడుదలకు సిద్ధమైన ఎన్టీఆర్ బయోపిక్ సినిమా సెన్సార్ పూర్తి చేసుకుంది. ఈ సినిమాకు సెన్సార్ బోర్డు క్లీన్ యూ సర్టిఫికెట్ మంజూరు చేసింది. ఎన్టీఆర్ జీవిత చరిత్రతో తెరకెక్కుతున్న ఈ సినిమాను ప్రముఖ దర్శకుడు క్రిష్ తెరకెక్కించటంతో సినిమాపై అంచనాలు మరింత పెరిగాయి. తొలుత ఈ సినిమా దర్శకుడిగా తేజను అనుకున్నా..తర్వాత రకరకాల కారణాలతో ఆయన పక్కకు తప్పుకున్నారు. తర్వాత ఈ బాధ్యతలను క్రిష్ చేపట్టారు. ఆ తర్వాత జరిగిన నటీనటుల ఎంపిక, అచ్చం ఎన్టీఆర్ తరహాలోనే బాలకృష్ణ పలు సన్నివేశాల్లో కన్పించటం..పాటలు..పాత్రదారులతో ఆ సినిమాపై అందరిలో ఆసక్తి మరింత పెరిగింది.

ఎన్‌బీకె ఫిలిమ్స్ బ్యానర్‌పై బయోపిక్ ను కథానాయకుడు’, ‘మహానాయకుడు’ అనే రెండు భాగాలుగా తీర్చిదిద్దుతున్నారు. మొదటి భాగాన్ని జనవరి 9న, రెండో భాగాన్ని ఫిబ్రవరి 7న విడుదల చేయనున్నారు. తాజాగా చిత్ర మొదటిభాగం ‘కథానాయకుడు’ సెన్సార్ పూర్తి చేసుకుందని పేర్కొంది చిత్రయూనిట్. ఎలాంటి సెన్సార్ కత్తిరింపులు లేకుండా క్లీన్ ‘యూ’ సర్టిఫికెట్ పొందిందని తెలుపుతూ పోస్టర్ రిలీజ్ చేశారు. ప్రేక్షకలోకంలో ఎంతో ఆసక్తి రేపుతున్న ఈ చిత్రంలో విద్యాబాలన్, కళ్యాణ్ రామ్, రానా, హన్సిక, పాయల్ రాజ్ పుత్, నిత్యామీనన్, రకుల్ ప్రీత్ సింగ్ లాంటి భారీ తారాగణం నటిస్తోంది.

Next Story
Share it