Telugu Gateway
Top Stories

సీఎం భార్య ఇంట్లో ఐటి సోదాలు

సీఎం భార్య ఇంట్లో ఐటి సోదాలు
X

ఐటి శాఖ దేశ వ్యాప్తంగా సినీ పరిశ్రమను టార్గెట్ చేసినట్లు కన్పిస్తోంది. దీని వెనక బలమైన కారణాలు కూడా ఉన్నాయి. భారీ ఎత్తున పన్ను ఎగవేతను దృష్టిలో పెట్టుకునే ఈ దాడులు చేస్తున్నారు. అయితే ఈ దాడుల్లో ముఖ్యమంత్రి భార్య కూడా ఉండటం విశేషం. అయితే ఆమె సినీ నటే. గురువారం ఉదయమే కర్ణాటకలో ఐటి దాడుల వ్యవహారం కలకలం రేపింది. ఏకకాలంలో 60 ప్రాంతాలలో అధికారులు దాడులకు దిగడం సంచలనం సృష్టించింది. ప్రధానంగా సినిమా పరిశ్రమకు చెందిన ప్రముఖుల నివాసాలు, కార్యాలయాలల్లో ఐటీ అధికారులు సోదాలు చేపట్టారు.

కర్ణాటక ముఖ్యమంత్రి కుమారస్వామి రెండో భార్య రాధిక, సినీ దిగ్గజ నిర్మాత రాక్ లైన్ వెంకటేష్, కన్నడ కంఠీరవ దివంగత రాజ్‌కుమార్ కుమారులు శివరాజ్‌కుమార్‌, పునీత్ రాజ్ కుమార్ నివాసాల్లో ఐటీ దాడులు జరగడం చర్చనీయాంశంగా మారింది. వీరితోపాటు పలువురు నటులు, నిర్మాతల నివాసాలు, కార్యాలయాలపై ఏకకాలంలో ఐటీ దాడులు నిర్వహించింది. హీరో సుదీప్ ‘కేజీఎఫ్‌’ నటుడు యశ్‌, ఈ సినిమా నిర్మాత విజయ్‌ ఇళ్లలోనూ సోదాలు కొనసాగుతున్నాయి. రాజకీయ కక్షసాధింపుతోనే కుమారస్వామి భార్య రాధిక నివాసంలో ఐటీ దాడులు చేపట్టారని జేడీ(ఎస్‌) నాయకులు విమర్శలు గుప్పిస్తున్నారు.

Next Story
Share it