Telugu Gateway
Andhra Pradesh

టీడీపీకి షాక్..వైసీపీలోకి మాజీ ఎమ్మెల్యే

టీడీపీకి షాక్..వైసీపీలోకి మాజీ ఎమ్మెల్యే
X

తెలంగాణలో ఎన్నికలు ముగిశాయి. ఇక ఆంధ్రప్రదేశ్ లో ఎన్నికల హడావుడి ప్రారంభం కానుంది. అందులో భాగంగానే అధికార టీడీపీకి ఇప్పుడు ఓ షాక్ తగిలింది. హిందుపురం మాజీ ఎమ్మెల్యే, టీడీపీ సీనియర్‌ నాయకుడు అబ్దుల్‌ గని శనివారం వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీలో చేరారు. ప్రజాసంకల్పయాత్రలో భాగంగా శ్రీకాకుళం జిల్లాలో పాదయాత్ర చేస్తున్న వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి సమక్షంలో అబ్దుల్‌ గని పార్టీలో చేరారు. గత నాలుగున్నరేళ్ల పాలనలో మైనారిటీలకు చంద్రబాబునాయుడు చేసేందేమీ లేదని ఈసందర్భంగా అబ్దుల్‌ గని పేర్కొన్నారు.

టీడీపీలో 30 ఏళ్లుగా తాను సేవలు అందించినా.. ప్రాధాన్యత కల్పించలేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. మైనారిటీలకు నాలుగు శాతం రిజర్వేషన్‌ కల్పించిన ఘనత దివంగత ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖరరెడ్డిదేనని గుర్తు చేశారు. వైఎస్సార్‌ ప్రవేశపెట్టిన ఫీజు రీయింబర్స్‌మెంట్‌ పథకం ద్వారా ఎంతోమంది విద్యార్థులు లబ్ధిపొందారని పేర్కొన్నారు.

Next Story
Share it