ఎన్టీఆర్ సినిమాలో మరో భామ
భారీ తారాగణం. భారీ సినిమా. ఎన్టీఆర్ బయోపిక్ అంటే మాటలా మరి?. అందుకే చాలా మందికి ఈ సినిమాలో ఛాన్స్ దక్కుతోంది. తాజాగా ఆ జాబితాలో మరో భామ చేరినట్లు సమాచారం. ఆమె తెలుగు అమ్మాయి ఈషా రెబ్బా. వచ్చే సంక్రాంతికే ఈ సినిమా సందడి చేయనుంది. అంటే నికరంగా ఇంకా నెల రోజులు మాత్రమే ఉంది. నందమూరి బాలకృష్ణ స్వయంగా నటిస్తూ నిర్మిస్తున్న సినిమాఎన్.టి.ఆర్. తండ్రి జీవితకథ ఆధారంగా తెరకెక్కిస్తున్న ఈ సినిమాలో బాలయ్య టైటిల్ రోల్లో నటిస్తున్నారు.
క్రిష్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో ఎన్టీఆర్ సతీమణిగా బాలీవుడ్ నటి విద్యాబాలన్తో పాటు శ్రీదేవిగా రకుల్ ప్రీత్ సింగ్, సామిత్రిగా నిత్యా మీనన్, కృష్ణకుమారిగా మాళవిక నాయర్, ప్రభగా శ్రియ,జయసుధ పాయల్ రాజ్పుత్, జయప్రధ హన్సికలు నటిస్తున్నారు. కొత్తగా జట్టులో చేరిన ఈషాతో బాలయ్య కాంబినేషన్లో పలు సన్నివేశాలు చిత్రీకరించారని సమాచారం. ప్రస్తుతం నిర్మాణదశలో ఉన్న ఈ సినిమా రెండు భాగాలుగా విడుదల కానుంది.