Telugu Gateway
Andhra Pradesh

చంద్రబాబు ముందే చేతులెత్తెస్తున్నారు

చంద్రబాబు ముందే చేతులెత్తెస్తున్నారు
X

తెలుగుదేశం అధినేత, ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడిపై వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఎన్నికలకు ముందుగానే చంద్రబాబు చేతులెత్తేస్తున్నట్లు కన్పిస్తోందని ఎద్దేవా చేశారు. ఈవీఎంలకు ట్యాంపరింగ్‌ చేయడం ఆయనకు బాగా తెలుసని, ఇప్పుడు ఆయన ఎత్తులు సాగవని తెలిసి ముందే భయపడుతున్నారని అన్నారు. ఏపీలో తుపానుతో ప్రజలు ఇబ్బందులు పడుతుంటే చంద్రబాబు మాత్రం ప్రమాణా స్పీకారాల కోసం యాత్రలు చేస్తున్నారని విమర్శించారు. ఆంధ్రప్రదేశ్‌ ప్రత్యేక హోదాను డిమాండ్‌ చేస్తూ వైఎస్సార్‌సీపీ రాజ్యసభ సభ్యులు పార్లమెంట్‌ ముందుగల గాంధీ విగ్రహం వద్ద ధర్నాకు దిగారు.

మంగళవారం పార్లమెంట్‌లో చర్చ సందర్భంగా విజయసాయి రెడ్డి స్పీకర్‌ పోడియం వద్దకు వెళ్లి నిరసన వ్యక్తం చేశారు. నినాదాల హోరుతో పార్లమెంట్‌ వాయిదా పడడంతో ఎంపీ ప్రభాకర్‌ రెడ్డితో కలిసి గాంధీ విగ్రహం వద్ద ఆందోళన చేశారు. గత ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో వైఎస్సార్‌పీసీ కంటే 5 లక్షల ఓట్లు ఎక్కువ రాబట్టుకుని అధికారంలోకి వచ్చిన చంద్రబాబు ఈసారి మాత్రం బ్యాలెట్‌ ద్వారానే ఎన్నికలు జరపాలని ఎందుకు అంటున్నారని ప్రశ్నించారు.

Next Story
Share it