మూడేళ్ల బాలిక నోట్లో బాంబు పేల్చారు
BY Telugu Gateway8 Nov 2018 4:36 AM GMT
X
Telugu Gateway8 Nov 2018 4:36 AM GMT
దారుణం జరిగింది. కొంత మంది యువకులు ఓ మూడేళ్ల బాలిక నోట్లో దీపావళి బాంబు పెట్టి పేల్చారు. దీంతో ఆ బాలిక తీవ్ర గాయాలతో ఇప్పుడు పోరాడుతోంది. ఈ దారుణ ఘటన ఉత్తరప్రదేశ్ లోని మీరట్ లో జరిగింది. దీపావళి పండగ రోజే ఈ దారుణం జరిగింది. వెంటనే బాధిత బాలికను పోలీసులు ఆస్పత్రికి చేర్చారు. ఈ ప్రమాదంలో బాలికకు 50 కుట్లు పడగా..గొంతు కూడా తీవ్రంగా దెబ్బతిన్నది. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి విచారణ ప్రారంభించారు.
Next Story