Telugu Gateway
Cinema

కొత్త ‘రికార్డు’ నెలకొల్పిన 2.ఓ

కొత్త ‘రికార్డు’ నెలకొల్పిన 2.ఓ
X

రజనీకాంత్ ప్రతిష్టాత్మక సినిమా 2.ఓ రికార్డుల వేట మొదలైంది. ప్రస్తుతం ఎక్కడ చూసినా రజనీ-శంకర్‌ కాంబినేషన్‌లో తెరకెక్కిన 2.ఓ గురించే వినిపిస్తోంది. ఇప్పటికే ఈ చిత్రం బ్లాక్‌ బస్టర్‌ టాక్‌తో నడుస్తోంది. 2.ఓ సినిమా ఇప్పటికే కొన్ని రికార్డులను సెట్‌ చేసిన సంగతి తెలిసిందే. ప్రపంచవ్యాప్తంగా దాదాపు 6800 థియేటర్లలో పదివేల స్ర్కీన్లపై ఈ చిత్రాన్ని రిలీజ్‌ చేశారు. ఇది ఓ రికార్డు. ఈ సినిమా అడ్వాన్స్‌ బుకింగ్స్‌ పై సోషల్‌ మీడియాలో ట్రెండ్‌ అయిన మీమ్స్‌ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.

ఆన్‌లైన్‌ బుకింగ్స్‌ ద్వారా ఈ మూవీ రికార్డులు క్రియేట్‌ చేస్తోంది. ఇప్పటికే పేటీఎమ్‌ ద్వారా 1.25 మిలియన్స్‌ టికెట్స్‌ అమ్ముడుపోయినట్టు తెలుస్తోంది. ఇక బుక్‌మైషో ద్వారా దాదాపు పది లక్షల టికెట్లు అమ్ముడు అయ్యాయని సమాచారం. ఇలా ఆన్‌లైన్లో అడ్వాన్స్‌ బుకింగ్‌ ద్వారానే ఇన్ని లక్షల టికెట్లు అమ్ముడవటం ‘2.ఓ’తోనే సాధ్యమైందని రజనీ అభిమానులు సంబరపడుతున్నారు.

Next Story
Share it