షాకింగ్.. సముద్రంలో కూలిన విమానం
BY Telugu Gateway29 Oct 2018 4:09 AM GMT
X
Telugu Gateway29 Oct 2018 4:09 AM GMT
అది లయన్ ఎయిర్ విమానం. టేకాఫ్ అయిన 13 నిమిషాలకే సముద్రంలో కూలిపోయింది. అందులో ఏకంగా 189 మంది ప్రయాణికులు ఉన్నారు. ఈ విమానం జకార్తా నుంచి పినాంగ్ కు బయలుదేరింది. బోయింగ్ 737 విమానం ఉదయం ఆరున్నర గంటలకు బయలుదేరింది. ఆ తర్వాత 13 నిమిషాలకే ఈ విమానం సముద్రంలో కుప్పకూలింది. ఆ ప్రాంతంలో విమాన శకలాలను కూడా గుర్తించారు. సహాయ బృందాలతో గాలింపు చర్యలు ప్రారంభించారు. అయితే ప్రయాణికులు ఎవరైనా బతికి బయటపడ్డారా అన్న అంశంపై ఇంకా స్పష్టత రావాల్సి ఉంది.
Next Story