Telugu Gateway
Cinema

ఎన్టీఆర్ ఫ్యాన్స్ కు గుడ్ న్యూస్

ఎన్టీఆర్ ఫ్యాన్స్ కు గుడ్ న్యూస్
X

జూనియ‌ర్ ఎన్టీఆర్, పూజా హెగ్డె జంట‌గా న‌టించిన అర‌వింద స‌మేత వీర‌రాఘ‌వ సినిమాకు గుడ్ న్యూస్. ఏపీలో ఈ సినిమా అద‌న‌పు షోల‌కు అనుమ‌తిస్తూ ప్ర‌భుత్వం సోమ‌వారం నాడు ఉత్త‌ర్వులు జారీ చేసింది. దీంతో ఏపీలోని 13 జిల్లాల్లో ఉద‌యం ఐదు గంట‌ల నుంచి 11 గంట‌ల వ‌ర‌కూ ప్ర‌త్యేక షోలు వేయ‌నున్నారు. ద‌స‌రా సెల‌వును పుర‌స్క‌రించుకుని ఈ వెసులుబాటు క‌ల్పించారు. ఈ ప్ర‌త్యేక షోల‌కు అనుమ‌తి సినిమా విడుద‌ల అయ్యే అక్టోబ‌ర్ 11 నుంచి 18వ తేదీ వ‌ర‌కూ కొన‌సాగ‌నుంది.

భారీ బ‌డ్జెట్ సినిమా అయినందున త‌మ‌కు అద‌న‌పు షోల‌కు అవ‌కాశం క‌ల్పించాల‌ని నిర్మాణ సంస్థ హారికా అండ్ హాసిని క్రియేష‌న్స్ చేసిన విన‌తికి అనుగుణగా ప్ర‌భుత్వం ఈ ఉత్త‌ర్వులుజారీ చేసింది. ఈ సినిమాను ప్ర‌ముఖ ద‌ర్శ‌కుడు త్రివిక్ర‌మ్ శ్రీనివాస్ తెర‌కెక్కించిన విష‌యం తెలిసిందే.

త్రివిక్ర‌మ్ శ్రీనివాస్, ఎన్టీఆర్ కాంబినేష‌న్ లో వ‌స్తున్న సినిమా కావ‌టంతో దీనిపై భారీ అంచ‌నాలే ఉన్నాయి. ఎన్టీఆర్ గ‌త సినిమా జై ల‌వ‌కుశ కూడా మంచి హిట్ గా నిలిచింది. అయితే త్రివిక్ర‌మ్ లాస్ట్ సినిమా అజ్ణాత‌వాసి బాక్సాఫీస్ వ‌ద్ద బోల్తా కొట్టింది. దీంతో ఎన్టీఆర్ అభిమానుల్లో ఒకింత టెన్ష‌న్ నెల‌కొంది. ఈ అంశంపై తాజాగా ఎన్టీఆర్ కూడా స్పందించారు. ఏ సినిమా ప్ర‌భావం దానిపైనే అని..ఒక దానికి ఇంకో దానితో లింక్

పెట్ట‌లేమ‌న్నారు.

Next Story
Share it