కెసీఆర్ ను సీఎం చేయాలి..నాకు ఓటేయాలి..ఐదు లక్షలిస్తా
BY Telugu Gateway27 Sep 2018 3:33 PM GMT
X
Telugu Gateway27 Sep 2018 3:33 PM GMT
టీఆర్ఎస్ పార్టీకి చెందిన తాజా మాజీ ఎమ్మెల్యే ఒకరు ఓటర్లతో జరిపిన బేరసారాల వ్యవహారం చర్చనీయాంశంగా మారింది. బహిరంగంగానే ఆయన తమకు ఓట్లు వేస్తే ఐదు లక్షలిస్తామని చెప్పటం విశేషం. ‘మీ 50 గ్రూపులు మీటింగ్ లు పెట్టుకోండి. ఇద్దరిద్దరో..ముగ్గురో ఉంటారు కదా?. మీటింగ్ పెట్టుకోండి. తీర్మానం చేయండి. ఏమని అంటే మేం అంతా వంద శాతం టీఆర్ఎస్ కెసీఆర్ ను సీఎం చేస్తాం. ఎమ్మెల్యేగా రవీందర్ రెడ్డికి ఓటు వేస్తాం అని తీర్మానం చేయండి.
మీకు ఐదు లక్షలు ఇస్తా. ’ ఇదీ ఆ నేత హామీ. వెంటనే మహిళా సంఘాలకు చెందిన ఓ మహిళ ఐదు లక్షలతో ఐతతా సార్ అంటే...ఫస్ట్ విడత అమ్మా అంటూ మరో నాయకుడు సముదాయించే ప్రయత్నం చేశారు. మహిళా సంఘాల సభ్యులు తమకు భవనం కావాలి అని అడగటంతో ఎల్లారెడ్డి తాజా మాజీ ఎమ్మెల్యే రవీందర్ రెడ్డి బహిరంగంగా జరిపిన బేరం ఇది.
Next Story