Telugu Gateway
Telangana

రేవంత్ రెడ్డిపై ఈడీ దాడులు!

రేవంత్ రెడ్డిపై ఈడీ దాడులు!
X

ఓటుకు నోటు కేసును తిరగతోడుతున్నారా?. రేవంత్ రెడ్డిపై ఈడీ దాడులు జరగనున్నాయా?. అంటే అవుననే అంటున్నారు రేవంత్ రెడ్డి. తనపై ఈడీ దాడి జరగనుందనే విషయాన్ని ఆపద్ధర్మ సీఎం కెసీఆర్ కొంత మంది సమాచారం ఇచ్చారని సంచలన ఆరోపణలు చేశారు. తనకు ఏదైనా జరిగితే అందుకు కెసీఆర్, డీజీపీ మహేందర్ రెడ్డి కారణం అవుతారని పేర్కొన్నారు. ఓటుకు నోటు కేసును తిరగదోడి తనను అరెస్టు చేసేందుకు కేసిఆర్ మోడీతో ఒప్పందం చేసుకున్నాడంటూ ఆరోపణలు చేశారు. సోమవారం హైదరాబాద్ లో జరిగిన మీడియా సమావేశంలో రేవంత్ రెడ్డి పలు కీలకమైన ఆరోపణలు చేశారు. డిజిపి మహేందర్ రెడ్డిని కాశీం రజ్వీతో పోలుస్తూ విమర్శలు గుప్పించారు. ప్రభుత్వ రద్దుకు ముందు తండ్రి కేసిఆర్, కొడుకు కేటిఆర్ ఢిల్లీ పర్యటనను చేపట్టారు. కొన్ని సార్లు అధికారికంగా, కొన్ని సార్లు రహస్యంగా హస్తిన పర్యటన చేశారు. కాంగ్రెస్ లో చేరిన తరువాత తాను పార్టీలో రాణించకుండా కుట్ర చేపట్టాడు కానీ కేసీఆర్ సఫలీకృతం కాలేదని రేవంత్ రెడ్డి తెలిపారు. ముందస్తు ఎన్నికల సందర్బంగా రేవంత్ రెడ్డి కి పదవి ఇస్తే టీఆర్ఎస్ ను అడ్డుకుంటాడు అని అక్రమ కేసులు పెట్టించాడు. రాజకీయంగా నన్ను ఎదుర్కోలేక ఓటుకు నోటు కేసు తీస్తున్నారు మళ్లీ. ఎ4 గా ఉన్న మత్తయ్య ఎఫ్ఐఆర్ చేయకుండా అరెస్టు చేశారని హైకోర్టులో క్వాష్ పిటిషన్ వేస్తే ఆయన మీద కేసును హైకోర్టు కొట్టేసింది. చంద్రబాబు స్టీఫెన్ సన్ తో ఫోన్ లో మాట్లాడాడు అని అందులో ఇరికించారు. రాష్ట్ర ప్రభుత్వం సుప్రీం కోర్టుకు వెళ్తే ప్రభుత్వానికి అనుకూలంగా రాలేదు.

ఇప్పుడు కేసీఆర్, మోడీ రహస్య ఒప్పందం ద్వారా మరోసారి కేసును తిరగదొదాలనుకుంటున్నారు. కేసీఆర్, మోడీ ఒకే దెబ్బకు రెండు పిట్టలు లాగా ఈడీ, సీబీఐ ద్వారా ఓటుకు నోటు కేసు పైన నా పైన, నా బందువులపైన ఇన్ కం టాక్స్ దాడులు చేయాలని ప్రణాళిక సిద్ధం చేసుకుంది. రాబోయే రోజుల్లో కాంగ్రెస్ పార్టీకి అత్యంత కీలకం. కార్యకర్తలు అప్రమత్తంగా ఉండాలి. దీనికి రాష్ట్ర డీజీపీ మహేందర్ రెడ్డి కేసీఆర్ కు చట్టాన్ని ఉల్లంఘించి మరీ సహకరిస్తున్నారు. డీజీపీ పాత డేట్ల పైన లేఖలు రాస్తున్నారు నా పైన విచారణకు. చట్టవ్యతిరేకమైన చర్యలతో ప్రైవేట్ సైన్యంతో డీజీపీ కేసీఆర్ కు కాసిమ్ రజ్వి లాగా చేస్తున్నారని విమర్శించారు. కాంగ్రెస్ అధినాయకత్వం తనకు ముఖ్యమైన పదవి ఇచ్చే అవకాశం ఉండటంతో, రాష్ట్రం అంతా తిరుగుతాపే కాబట్టి ఇలాంటి పనులకు టీఆర్ఎస్ పార్టీ, కేసీఆర్ కుట్ర చేస్తున్నారు. జగ్గారెడ్డి, గండ్ర వెంకటరమణారెడ్డి, కూన శ్రీశైలం గౌడ్ మీద అక్రమ కేసులు పెట్టించిన కేసిఆర్ ఇప్పుడు తనపైనా అక్రమ కేసులు పెట్టబోతున్నారు. రానున్న ఎన్నికల్లో టిఆర్ఎస్ భారీ మూల్యం చెల్లించక తప్పదని హెచ్చరించారు.

Next Story
Share it