Telugu Gateway
Telangana

మీడియా అధినేతతో ‘ముఖ్య’నేత మూడు గంటల భేటీ

మీడియా అధినేతతో ‘ముఖ్య’నేత మూడు గంటల భేటీ
X

తెలంగాణ రాజకీయ వర్గాల్లో ఇప్పుడు ఇదే హాట్ టాపిక్. తెలంగాణ ప్రాంతానికి చెందిన ముఖ్యనేత ఒకరు తన తనయుడితో కలసి తాజాగా ఓ మీడియా అధినేతతో మూడు గంటల పాటు నిర్వహించిన సమావేశం విషయం కాస్త ఆలశ్యంగా వెలుగులోకి వచ్చింది. ఆ నేత తనయుడు కొద్దిసేపు మాత్రమే అక్కడ ఉండి వెళ్లిపోయారు. కీలక నేత మాత్రం మూడు గంటల పాటు ఆ మీడియా అధినేతతో విస్తృతంగా చర్చలు జరిపారు. గత కొంత కాలంగా వీరిద్దరి మధ్య సఖ్యత చాలా బాగా సాగుతుందని ప్రచారం మీడియా సర్కిల్స్ లో బలంగా విన్పిస్తోంది.

ఈ భేటీ తర్వాతే పలు కీలక అంశాలు వెలుగులోకి వచ్చినట్లు చెబుతున్నారు. తెలంగాణలో ముందస్తు ఎన్నికలకు రంగం సిద్ధం కావటంతో పలు అంశాలపై వీరిద్దరి భేటీ మధ్య చర్చ జరిగినట్లు సమాచారం. ఎన్నికల్లో గెలుపు అవకాశాలు..గెలుపునకు చేయాల్సిన పనులు..ప్రత్యర్థి పార్టీలను దెబ్బకొట్టేందుకు అనుసరించాల్సిన వ్యూహాల విషయంలో వీరి మధ్య చర్చకు వచ్చాయని చెబుతున్నారు.

Next Story
Share it