Telugu Gateway
Andhra Pradesh

అందరి టిక్కెట్లు లోకేష్ ఖరారు చేస్తారు..ఆయన టిక్కెట్...!

అందరి టిక్కెట్లు లోకేష్ ఖరారు చేస్తారు..ఆయన టిక్కెట్...!
X

నారా లోకేష్. ఏపీ మంత్రి..టీడీపీ ప్రధాన కార్యదర్శి. ఈ మధ్య కర్నూలు జిల్లా పర్యటనకు వెళ్లి ఏకంగా కర్నూలు ఎంపీ టిక్కెట్ బుట్టా రేణుక, ఎమ్మెల్యే టిక్కెట్ ఎస్వీ మోహన్ రెడ్డికే అని ప్రకటించి కలకలం రేపారు. టీడీపీ రాజ్యసభ సభ్యుడు టీజీ వెంకటేష్ అయితే అసలు టిక్కెట్లు ప్రకటించటానికి లోకేష్ ఎవరు?. ఆయన ఏమైనా పార్టీ అధ్యక్షుడా? అంటూ ఘాటు విమర్శలు కూడా చేశారు. అయినా సరే అటు చంద్రబాబుకానీ..ఇటు నారా లోకేష్ కానీ దీనిపై స్పందించింది లేదు. అంటే చంద్రబాబునాయుడు కూడా కావాలనే..పార్టీ నేతలకు లోకేష్ తో సరిగా ఉంటే టిక్కెట్.. లేదంటే ఇంటికే అనే సందేశం పంపించటానికే అలా ప్లాన్ చేశారని పార్టీ వర్గాల్లో జోరుగా ప్రచారం జరుగుతుంది. లేదంటే లోకేష్ ప్రకటనను చంద్రబాబు తప్పుపట్టారు..అలా చెప్పకూడదు అని లోకేష్ ను మెల్లగా మందలించారు అంటూ లీక్ లు వచ్చేవి. ఎక్కడివారు అక్కడే గప్ చుప్ అన్న చందంగా ఉన్నారంటే అది చంద్రబాబు ఆమోదంతోనే జరిగిందనే విషయం తెలిసిపోతుంది. ఇదంతా పాత కథ అయితే..లోకేష్ ఓ ఛానల్ కు ఇఛ్చినా ఇంటర్వ్యూలో మీరు ఏ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తారు అని ప్రశ్నిస్తే..మాత్రం పార్టీ నిర్ణయిస్తుంది.

పొలిట్ బ్యూరో నిర్ణయిస్తుంది అని భలే చెప్పారు. మరి కర్నూలు ఎంపీ, ఎమ్మెల్యే సీట్ల ఖరారును పార్టీ నిర్ణయించిందా?.లేక పొలిట్ బ్యూరో నిర్ణయించిందా?. అంటే ఇప్పుడు పార్టీ అన్నా...పొలిట్ బ్యూరో అన్నా అంతా నారా లోకేష్ అనే అర్థం చేసుకోవాలా?. లోకేష్ ఆ ఇంటర్వ్యూలో చెప్పిందే నిజం అయితే...మరి కర్నూలు లో లోకేష్ చేసిన ప్రకటన తప్పా?. లేదంటే ఆ ఇంటర్వ్యూలో చెప్పింది ఏదో ప్రజలకు తమ దగ్గర అంతా ప్రజాస్వామ్యయుతంగా సాగుతుంది అన్న నమ్మించటానికా?. రెండూ నిజాలు కావు..అబద్ధాలు కావు. అందులో ఏదో ఒకటే నిజం ఉండాలి. అదేదో లోకేష్ చెపితే బాగుంటదేమో?..

Next Story
Share it