కత్తి మహేష్ అరెస్టు
నిత్యం వివాదాల్లో ఉండే వ్యక్తి కత్తి మహేష్. తాజాగా శ్రీరాముడిపై అభ్యంతరకర వ్యాఖ్యలు చేయటంతో పోలీసులు ఆయన్ను అరెస్టు చేశారు. ఓ ఛానల్ లో జరిగిన చర్చా కార్యక్రమంలో కత్తి మహేష్ అనుచిత వ్యాఖ్యలు చేసినట్లు పలు స్టేషన్లలో ఫిర్యాదులు నమోదు అయ్యాయి. దీంతో బంజారాహిల్స్ పోలీసులు ఆయన్ని అదుపులోకి తీసుకున్నారు. కత్తి మహేశ్ వ్యాఖ్యలపై హిందూ సంఘాలు మండిపడ్డాయి. అనుచిత వ్యాఖ్యలు చేసి హిందువుల మనోభావాలను కించపరిచారంటూ విశ్వహిందూ పరిషత్ కార్యకర్త కిరణ్ నందన్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కత్తి మహేష్పై ఐపీసీ సెక్షన్ 295(1), 505(2)ల కింద కేసు నమోదు చేసి కత్తి మహేశ్ను ఇంటి దగ్గర నుంచి అదుపులోకి తీసుకుని బంజారాహిల్స్ పోలీసు స్టేషన్కు తరలించారు. గతంలో కత్తి మహేష్ కు..జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అభిమానుల మధ్య తీవ్ర వివాదాలు చెలరేగిన సంగతి తెలిసిందే. ఛానళ్ళలో చర్చల ద్వారా పవన్ అభిమానులకు కత్తి మహేష్ వార్నింగ్ కూడా ఇఛ్చారు. తర్వాత ఈ వివాదానికి పుల్ స్టాప్ పెట్టారు.