Telugu Gateway
Top Stories

చిక్కుల్లో శశిధరూర్

చిక్కుల్లో శశిధరూర్
X

కాంగ్రెస్ సీనియర్ నేత శశిధరూర్ చిక్కుల్లో పడ్డారు. ధరూర్ భార్య కొద్ది రోజుల క్రితం అనుమానాస్పదంగా మరణించిన విషయం తెలిసిందే. ఈ కేసు సంబంధించిన ఛార్జిషీట్ లో శశిధరూర్ పేరు చేర్చారు. ఈ మేరకు ఢిల్లీ పోలీసులు ఛార్జిషీట్ ధాఖలు చేశారు. థరూరే సునందను ఆత్మహత్యకు ప్రేరేపించారని అందులో ఢిల్లీ పోలీసులు పేర్కొన్నారు. ఈ మేరకు సోమవారం పాటియాలా కోర్టులో ఛార్జ్‌ షీట్‌ను పోలీసులు దాఖలు చేశారు. అనంతరం ఈ కేసును మే 24వ తేదీకి కోర్టు వాయిదా వేసింది. జనవరి 17, 2014లో ఢిల్లీలోని ఓ లగ్జరీ హోటల్‌ ఆమె అనుమానాదాస్పద స్థితిలో మృతి చెందారు. అయితే సునంద విష ప్రభావం వల్లే మృతిచెందినట్లు ఎయిమ్స్ వైద్యులు ధృవీకరించటంతో ఈ కేసులో అనుమానాలు మరింత పెరిగాయి.

మానసిక ఆందోళన నుంచి ఉపశమనం కోసం వాడే అల్ప్రాక్స్ మత్తు పదార్థం ఆమె శరీరంలో మోతాదుకు మించిన ఉన్నట్లు వైద్యులు గుర్తించారు. అయితే సునందే వీటిని తీసుకున్నారా లేక ఎవరైనా ఉద్దేశపూర్వకంగానే ఆమెకు అతిగా ట్యాబ్లెట్లు ఇచ్చారా? మత్తు పదార్థాన్ని ఇంజక్షన్ ద్వారా ఎక్కించారా అన్న సందేహాలు వ్యక్తం అయ్యాయి. ఛార్జిషీట్ లో శశిధరూర్ పేరు చేర్చటాన్ని కాంగ్రెస్ తీవ్రంగా తప్పుపట్టింది. ప్రధాని మోడీ కావాలనే ఇలా చేశారని ఆ పార్టీ ఆరోపిస్తోంది. ప్రభుత్వానికి వ్యతిరేకంగా గట్టిగా మాట్లాడేవారిని ఏదో ఒక కేసులో ఇరికించాలని చూస్తున్నట్లు ఆరోపించారు.

Next Story
Share it