Telugu Gateway
Top Stories

సంచలనంగా విజయ్ మాల్యా మూడవ పెళ్ళి

భారతీయ బ్యాంకులను నిండా ముంచి లండన్ లో విలాసవంతం అయిన జీవితం గడుపుతున్న విజయ్ మాల్యా మూడవ పెళ్లికి సిద్ధమైనట్లు వార్తలు వస్తున్నాయి. దీనిపై సామాజిక మాధ్యమాల్లో సెటైర్లు పెద్ద ఎత్తున పేలుతున్నాయి. ఈ పెళ్లికి భారత్ నుంచి ప్రత్యేక విమానంలో ఎవరెవరు వెళతారో ఊహించుకోండి అంటూ కామెంట్లు చేస్తున్నారు. భారత్ లోని బ్యాంకులకు 9000 కోట్లు ఎగ్గొట్టిన విజయ్ మాల్యా అదే డబ్బుతో లండన్ లో ఖరీదైన ఇళ్ళు కొనుక్కొని ఎంజాయ్ చేస్తున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఆయన మూడవ పెళ్ళి వ్యవహారం హాటా టాపిక్ గా మారింది. ఎయిర్‌ హోస్టెస్‌ పింకీ లాల్వాణీని పెళ్లి చేసుకోబోతున్నట్లు వార్తలు వెలువడ్డాయి. పింకీ లల్వాణీ, విజయ్‌ మాల్యాకు 2011లో పరిచయం అయ్యింది.

అనంతరం మాల్యా ఆమెకు తన ఎయిర్‌లైన్స్‌ కింగ్‌ఫిషర్‌ ఎయిర్‌లైన్స్‌ లో ఎయిర్‌హోస్టెస్‌గా ఉద్యోగం కల్పించారు. కాల క్రమేణా వీరి పరిచయం ప్రేమకు దారితీసింది. అప్పటి నుంచి సహజీవనం చేస్తున్నారు. వీరిద్దరు ఈ మధ్య కాంలలో ఎక్కడ చూసినా జంటగానే కనిపిస్తున్నారు. మాల్యాకు ఎయిర్‌హోస్టెస్ తో ప్రత్యేక అనుబంధం ఉంటుంది. ఆయన మొదటి భార్య సమీరా త్యాబ్జీ సైతం ఎయిర్‌ హోస్టెస్‌. 1986లో సమీరాను వివాహామాడిన మాల్యా, 1993లో రేఖను పెళ్లి చేసుకున్నారు. వీరికి ముగ్గురు సంతానం ఉన్నారు. వీరిలో కుమారుడు సిద్దార్థ్‌, కుమార్తెలు లెన్నా, తాన్యాలు. విజయ్ మాల్యాను భారత్ కు రప్పించే ప్రయత్నాలు ఏవీ సఫలం కావటం లేదు. ఈ తరుణంలో ఆయన పెళ్ళి వార్త మరింత సంచలనంగా మారింది.

Next Story
Share it