సందడి మొదలుపెట్టిన మహేష్ బాబు
‘భరత్ అను నేను’ సినిమా విడుదల తేదీ దగ్గరకు వస్తుండటంతో మహేష్ బాబు సందడి మొదలైంది. ప్రస్తుతం స్పెయిన్ లో ఓ పాట చిత్రీకరణ సాగుతోంది. ఇది పూర్తి అయితే సినిమా చిత్రీకరణ పూర్తయినట్లే. అదే సమయంలో ఆదివారం నాడు మరో పాటను విడుదల చేయనున్నారు. ఈ విషయాన్ని చిత్ర యూనిట్ అధికారికంగా ప్రకటించింది. ఏప్రిల్ 20న ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానున్న విషయం తెలిసిందే. ఇప్పటి వరకు మహేష్కు సంబంధించిన స్టిల్స్ ను మాత్రమే రిలీవ్ చేసిన చిత్రయూనిట్ తాజాగా హీరోయిన్ లుక్ ను రివీల్ చేస్తూ ఓ పోస్టర్ ను రిలీజ్ చేశారు.
మహేష్ తో పాటు కైరా నడిచి వస్తున్న ఈ స్టిల్ సూపర్ స్టార్ అభిమానులను ఖుషీ చేస్తోంది. మహేష్ బాబు ముఖ్యమంత్రిగా నటిస్తున్న ఈసినిమాతో బాలీవుడ్ బ్యూటీ కైరా అద్వాని నటిస్తోంది. ఏప్రిల్ 7న భరత్ అనే నేను ప్రీ రిలీజ్ వేడుకను అభిమానుల సమక్షంలో ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. మహేష్ బాబు, కొరటాల కాంబినేషన్ కావటంతో దీనిపై అందరిలో ఆసక్తి నెలకొంది. ఈ సమ్మర్ లో విడుదల కానున్న భారీ బడ్జెట్ సినిమాల్లో ఇది ఒకటి. ఇప్పటికే రంగస్థలం విడుదలై మంచి టాక్ సొంతం చేసుకుంది.