అదరగొడుతున్న రంగస్థలం ‘సక్కగున్నావే’
పల్లెటూరి పరిమళాలు. మట్టివాసనలు. ఆ పాట చూస్తే ఎవరికైనా ఇవే గుర్తుకొస్తాయి. రామ్ చరణ్, సమంతలు జంటగా నటించిన ‘రంగస్థలం’ సినిమాకు సంబంధించిన మొదటి పాటను శివరాత్రి సందర్భంగా మంగళవారం సాయంత్రం విడుదల చేశారు. ‘ఎంత సక్కగున్నావే..’ అంటూ రామలక్ష్మిని పొడుగుతూ చిట్టిబాబు పాడుకున్న ఈ పాట అభిమానులను అలరిస్తోంది. ఈ పాటకు సంబంధించిన చిత్రాల్లో సమంత హావభావాలు పర్పెక్ట్ గా సెట్ అయ్యేలా ఉన్నాయి. విడుదలైన గంటలోనే మూడున్నర లక్షల పైచిలుకు వ్యూస్ దక్కించుకుంది.
తాజాగా విడుదలైన పాట అభిమానులను విశేషంగా ఆకట్టుకుంటోంది. చంద్రబోస్ రాసిన ఈ పాటను స్వీయ స్వరకల్పనలో సంగీత దర్శకుడు దేవిశ్రీప్రసాద్ పాడారు. మైత్రీ మూవీ మేకర్స్ పతాకంపై నవీన్ ఎర్నేని, వై. రవిశంకర్, చెరుకూరి మోహన్ నిర్మిస్తున్న ఈ సినిమా మార్చి 30న విడుదలకానుంది. ‘‘హో.. హో.. హో.. ఏం వయ్యారం.. ఏం వయ్యారం...’’ అంటూ రామ్చరణ్ వాయిస్తో సాగే టీజర్ ఇంతకుముందు విడుదలై సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే.
https://www.youtube.com/watch?v=-xgy9rTzUnw