Telugu Gateway
Top Stories

ఉద్యోగులకు నిరాశ మిగిల్చిన బడ్జెట్

ఉద్యోగులకు నిరాశ మిగిల్చిన బడ్జెట్
X

ప్రతి బడ్జెట్ కు ముందు ఎన్నో ఆశలు. ఎన్నికలు వస్తున్నాయ్ కదా..ఈ సారి అయినా ఆదాయ పన్ను పరిమితి పెంచకపోతారా? అని ఆశ. కానీ ఈ సారి కూడా వారి ఆశలు అడియాశలే అయ్యాయి. ఉద్యోగవర్గాలకు ఎలాంటి మినహాయింపులు ఇవ్వకుండా కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి అరుణ్ జైట్లీ బడ్జెట్ ను మూసేశారు. 2018-19 ఆర్థిక సంవత్సరానికి ఆదాయపు పన్ను మినహాయింపు పరిమితుల్లో ఎలాంటి మార్పులు చేయకుండా యథావిధిగానే ఉంచారు. ప్రయాణ, వైద్య ఖర్చులకు మాత్రమే రూ.40వేల వరకు పన్ను రాయితీని(స్టాండర్డ్‌ డిడక్షన్‌ను) ఇస్తున్నట్లు తెలిపారు.

ఇది కూడా వ్యక్తిగత వ్యాపారస్తుల కంటే ఎక్కువగా పన్నులు చెల్లిస్తున్న వారికేనని చెప్పారు. సీనియర్‌ సిటిజన్లకు వైద్య ఖర్చులకు అదనపు రాయితీ అందిస్తున్నట్టు తెలిపారు. ఈ నిర్ణయంతో 2.5 కోట్ల వేతన ఉద్యోగులకు, పెన్షనర్లకు లబ్ది చేకూరనుందని పేర్కొన్నారు. రూ.250 కోట్ల రెవెన్యూ ఉన్న కంపెనీలకు కార్పొరేట్‌ పన్నుని 25 శాతం తగ్గించారు. ఆదాయపు పన్ను పరిధిలోకి కొత్తగా 5 లక్షల మంది చేరినట్టు చెప్పారు. అదనంగా రూ.90వేల కోట్ల ఆదాయ పన్ను వసూలైనట్టు జైట్లీ తెలిపారు.

Next Story
Share it