నాగార్జున ‘వేదాంతం’
BY Telugu Gateway27 Feb 2018 3:03 PM GMT

X
Telugu Gateway27 Feb 2018 3:03 PM GMT
అక్కినేని నాగార్జున వేదాంతంలో మునిగిపోయారు. దీనికి ప్రధాన కారణం ప్రముఖ నటి శ్రీదేవి మరణం. అక్కినేని నాగేశ్వరరావుతో కలసి హీరోయిన్ గా పలు సినిమాల్లో చేసిన శ్రీదేవి..నాగార్జునతోనూ హీరోయిన్ గా నటించింది. ప్రస్తుతం నాగార్జున తనకు ‘శివ’లాంటి సూపర్ హిట్ ఇచ్చిన రామ్ గోపాల్ వర్మతో సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. వాస్తవానికి ఈ సినిమా ఫస్ట్ లుక్ విడుదల చేయాల్సి ఉన్నా..శ్రీదేవి మరణంతో అది వాయిదా పడింది.
ముఖ్యంగా దర్శకుడు రామ్ గోపాల్ వర్మ శ్రీదేవికి అరివీరభయంకరమైన ఫ్యాన్ అన్న సంగతి తెలిసిందే. ఆమె మరణ వార్త విన్నప్పటి నుంచి వర్మ ట్వీట్లతో దేవుడిపై కోపం ప్రదర్శిస్తూనే ఉన్నాడు. బాధలో ఉన్న వర్మను ఒకింత ఓదార్చే ప్రయత్నం చేశాడు నాగార్జున. అందులో భాగంగా ట్విట్టర్ లో ఈ సీనియర్ హీరో 'అనుకున్నామని జరగవు అన్నీ, అనుకోలేదని ఆగవు కొన్ని' అంటూ పోస్టు చేశాడు.
Next Story