Telugu Gateway
Top Stories

బోనీకపూర్ ను విచారించిన పోలీసులు!

బోనీకపూర్ ను విచారించిన పోలీసులు!
X

శ్రీదేవి ఆకస్మిక మృతికి చెందిన అంశంపై దుబాయ్ పోలీసులు ఆమె భర్త బోనీకపూర్ ను సుదీర్ఘంగా విచారించారు. ఆయన స్టేట్ మెంట్ ను వీడియో రికార్డ్ చేశారు. పోలీసుల ఉన్నతాధికారుల బృందం ఈ పని చేసింది. మూడున్నర గంటల పాటు ఆయన్ను విచారించారని, రికార్డెడ్‌ ఆన్‌ కెమెరా ముందు బోనీ స్టేట్‌మెంట్‌ను రికార్డు చేసినట్టు సమాచారం. నీళ్లతో నిండి ఉన్న బాత్‌టబ్‌లో శ్రీదేవీ అకస్మారక పరిస్థితిలో ఉన్నట్టు గుర్తించినట్టు బోని చెప్పినట్టు నివేదికలు బహిర్గతం చేస్తున్నాయి. శ్రీదేవీని రషీద్‌ ఆసుపత్రికి తరలించిన సమయంలో బోనీతో పాటు ఉన్న మరో ముగ్గురు వ్యక్తుల వాంగ్ములాన్ని కూడా పోలీసులు రికార్డు చేశారు. అపస్మారక స్థితిలో శ్రీదేవీ టబ్‌లో పడిపోయి ఉన్న సమయంలో, బోని వారికే ముందస్తుగా కాల్‌ చేసి సమాచారం అందించాడు. రషీద్‌ ఆసుపత్రికి చెందిన ఇద్దరు డాక్టర్లు, ఐదుగురు అటెండెంట్ల వాంగ్ములాన్ని రికార్డు చేశారు.

మరోవైపు శ్రీదేవీ మృతిపై వస్తున్న అనుమానాలను నివృత్తి చేస్తూ యూఏఈ ఆరోగ్యశాఖ ఫోరెన్సిక్‌ రిపోర్టును విడుదల చేసింది. ఆ రిపోర్టులో ప్రమాదవశాత్తు ఆమె కాలు జారి నీటి టబ్‌లో పడిపోవడం వల్లే మృతి చెందినట్టు పేర్కొంది. శనివారం రాత్రి 7 గంటల సమయంలో బాత్రూంకి వెళ్లిన శ్రీదేవీ, బాత్రూంలో కాలు జారి నీళ్ల టబ్‌లో పడిపోయిందని, ఆ సమయంలో ఊపిరాడక చనిపోయినట్టు తెలిపింది. ఘటన జరిగిన తర్వాత కొద్ది సేపటికి హోటల్‌ గదికి వచ్చిన బోని కపూర్‌, హోటల్‌ సిబ్బంది సాయంతో బాత్రూం డోర్లను బద్దలు కొట్టి తెరిచారు. ఆ సమయంలో అపస్మారక స్థితిలో ఉన్న శ్రీదేవీని, హుటాహుటిన దగ్గర్లోని రషీద్‌ ఆసుపత్రికి తరలించారు. అప్పటికే శ్రీదేవి మరణించినట్లు డాక్టర్లు తెలిపారు.

Next Story
Share it