మోహన్ బాబు ‘గాయత్రి’ ఫస్ట్ లుక్
మోహన్ బాబు కొంత గ్యాప్ తర్వాత మళ్ళీ వెండితెరపై సందడి చేయటానికి రెడీ అవుతున్నాడు. ఆయన నటించిన సినిమా ‘గాయత్రి’ కి సంబంధించిన ఫస్ట్ లుక్ ను క్రిస్మస్ సందర్భంగా విడుదల చేశారు. ఫస్ట్ లుక్ పోస్టర్ లో ఉన్న ఓ డైలాగు అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. ‘ఆరోజు రాముడు చేసింది తప్పు అయితే..నాదీ తప్పే’ అంటూ మోహన్ బాబు సీరియస్ గా చూస్తున్న పోస్టర్ అభిమానుల్లో ఆసక్తి రేపుతోంది. తన డైలాగ్ డెలివరితో పాటు ఎన్నో ప్రత్యేకతలు ఉన్న మోహన్ బాబు ప్రధాన పాత్ర పోషిస్తున్న ఈ సినిమాలో ఆయన తనయుడు మంచు విష్ణు తోపాటు శ్రియ, యాంకర్ అనసూయ, నిఖిలా విమల్ ఇతర కీలకపాత్రలు పోషిస్తున్నారు. సొంత బ్యానర్ లక్ష్మీప్రసన్న పిక్చర్స్ పైనే ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. కొత్త సంవత్సరంలో ఈ సినిమా థియేటర్లలో సందడి చేయనుంది. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనులు సాగుతున్నాయి. ఈ సినిమాకు ఆర్ మధన్ దర్శకత్వం వహిస్తున్నారు.
కెసీఆర్ పెద్ద పరీక్షే పెట్టుకున్నారు..అందులో విజయం సాధ్యమా?!
2 July 2022 12:50 PM GMTస్పైస్ జెట్ విమానంలో పొగ..ప్రయాణికులు ఉక్కిరిబిక్కిరి
2 July 2022 5:36 AM GMTఆవో-దేఖో-సీకో
1 July 2022 3:17 PM GMTనుపుర్ శర్మపై సుప్రీం ఫైర్
1 July 2022 6:58 AM GMTఏపీలో సర్కారు వారి 'సినిమా ఆగింది'
1 July 2022 6:24 AM GMT
ప్రేమలేఖలు అందాయన్న శరద్ పవార్
1 July 2022 6:05 AM GMTఫడ్నవీస్ కు అధిష్టానం షాక్..డిప్యూటీ సీఎం పదవి
30 Jun 2022 2:04 PM GMTవ్యూహాం మార్చిన బిజెపి..శివసేనను పూర్తిగా ఖతం చేసేందుకేనా!
30 Jun 2022 12:27 PM GMTముంబయ్ చేరుకున్న ఏక్ నాథ్ షిండే
30 Jun 2022 9:42 AM GMTసంజయ్ రౌత్ కు ఈడీ నోటీసులు
27 Jun 2022 12:15 PM GMT