Telugu Gateway
Telangana

డిసెంబర్ 9 నుంచి కెసీఆర్ కు నిద్ర ఉండదు

కాంగ్రెస్ నేత రేవంత్ రెడ్డి మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. డిసెంబర్ 9 నుంచి తెలంగాణ సీఎం కెసీఆర్ కు నిద్ర ఉండదని వ్యాఖ్యానించారు. రాజకీయంగా తన ఎత్తుగడలు తనకు ఉన్నాయని వ్యాఖ్యానించారు. రేవంత్ శనివారం నాడు మీడియాతో చిట్ చాట్ చేశారు. తనపై విమర్శలు చేసిన టీ టీడీపీ అధ్యక్షుడు ఎల్ .రమణపై కూడా తీవ్ర వ్యాఖ్యలు చేశారు. తనతో పాటు పార్టీ మారమని ఏ ఒక్క నాయకున్ని అడగలేదన్నారు. ‘ నేను చెప్పాలనుకున్నది చంద్రబాబు కి చెప్పే వచ్చాను. టీడీపీ లో ఉంటూ కేసీఆర్ కు ఉపాది కూలీ పని చేస్తున్నవారికి. నేను చెప్పాల్సింది ఏమీ లేదు. కంచర్ల భూపాల్ రెడ్డి టీఆరెస్ లో చేరితే ఎల్ రమణ ఎందుకు మాట్లాడలేదు? ఎల్ రమణ కేసీఆర్ దగ్గర ఉపాధి హామీ కూలి డబ్బు తెచ్చుకుని నాపై విమర్శలు చేస్తున్నాడు.

ఈ విషయంలో ఏమాత్రం అనుమానం లేదు. కొడంగల్ లో మీటింగ్ పెడతా అంటున్న ఎల్ రమణ .. గజ్వేల్, సిద్ధిపేట్ లో మీటింగ్ పెడుతా అని ఎందుకు చెప్పడం లేదు? చేరాలనుకుంటే ముసుగు తీసి నేరుగా టిఆర్ ఎస్ లో ఎల్.రమణ చేరొచ్చు కదా? టిఆర్ఎస్ ముసుగులో టీడీపీ లో పని చేస్తున్నాడు ఎల్ రమణ. టీడీపీ లో వున్న నేతలందరిని టిఆర్ఎస్ లో చేర్చే వరకు రమణ టిఆర్ఎస్ తీర్థం పుచ్చుకోడు. నాకు కేసీఆర్ ఉపాధి కూలీ ఎల్ రమణ సర్టిఫికెట్ అవసరం లేనే లేదు. చేతనైతే సొంత నియోజకవర్గం లో మీటింగ్ పెట్టుకుని గెలవాలి ఎల్ రమణ. కేసీఆర్ కూలీల పై కాదు.. కెసిఆర్ పైనే నా యుద్ధం అని ’ రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు.

Next Story
Share it