Telugu Gateway
Cinema

మైండ్ దొబ్బింది ఓకే..జ్యూస్ సంగతి తేలాలి

ఎదుటివారిపై విమర్శలు చేయటమే కాదు..తనపై కూడా తాను విమర్శలు చేసుకోగల వ్యక్తి ఎవరైనా ఉన్నారా? అంటే అది ఖచ్చితంగా రామ్ గోపాల్ వర్మ అని చెప్పొచ్చు. అలాంటి కోవలోకే వస్తుంది ఈ సంఘటన. నాగార్జున హీరో రామ్ గోపాల్ వర్మ దర్శకత్వంలో కొత్త సినిమా షూటింగ్ సోమవారం నాడు ప్రారంభం అయింది. ఈ సినిమాకు రామ్ గోపాల్ వర్మ తల్లి సూర్యావతి క్లాప్ కొట్టి ప్రారంభించారు. ఈ సందర్భంగా వర్మ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ‘గత కొంతకాలంగా రాంగోపాల్ వర్మకు మైండ్ దొబ్బింది, జ్యూస్ అయిపోయింది అంటున్నారు. అందులో మైండ్ దొబ్బిందన్న మాట నిజం. కానీ, జ్యూస్ అయిపోయిందా? లేదా? అన్నది ఈ సినిమా తరువాత తెలుస్తుంది.’ అని వ్యాఖ్యానించారు.

అన్నపూర్ణ స్టూడియో అంటే తనకు సెంటిమెంట్‌ అని, డిసెంబర్‌ 22 నుంచి రెగ్యులర్‌ షూటింగ్‌ జరుగుతుందని తెలిపారు. 28 సంవత్సరాల క్రితం తెలుగు సినీ చరిత్రలో కొత్త ట్రెండ్‌ను సృష్టించిన 'శివ' కాంబినేషన్ మరోసారి రిపీట్ అయింది. 'శివ' చిత్రం సమయంలో నాగార్జున తనపై నమ్మకం ఉంచి ఎంత ఫ్రీడమ్ ఇచ్చారో, ఇప్పుడూ అదే విధమైన స్వేచ్ఛను తనకిచ్చారని తెలిపాడు. ఈ కథను తాను నాగ్ కు చెప్పిన తరువాత, ఎంతో ఎగ్జయిట్ అయ్యారని, తాను అంతే స్థాయిలో సినిమాను తీయనున్నట్లు పేర్కొన్నాడు.

Next Story
Share it