నాయిని నర్సింహారెడ్డి ఇంట మరో విషాదం
BY Admin26 Oct 2020 4:06 PM GMT
X
Admin26 Oct 2020 4:06 PM GMT
వరస విషాదాలు. ఆ కుటుంబాన్ని షాక్ కు గురి చేస్తున్నాయి. ఈ నెల 22నే కార్మిక నేత, మాజీ హోం మంత్రి నాయిని నర్సింహారెడ్డి తుది శ్వాస విడిచిన విషయం తెలిసిందే. సోమవారం నాడు మాజీ మంత్రి, టీఆర్ఎస్ దివంగత నేత నాయిని భార్య అహల్య కన్నుమూశారు. అపోలో ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఆమె మృతి చెందారు. ఇటీవల నాయిని, ఆయన భార్య అహల్య కరోనా బారిన పడ్డారు.
దీంతో ఇద్దరు హైదరాబాద్లోని ప్రైవేట్ ఆస్పత్రిలో చేరారు. భర్త నాయిని నర్సింహ రెడ్డి మృతితో ఆఖరి చూపుకు అహల్యను కుటుంబ సభ్యులు అంబులెన్స్లో తీసుకొచ్చారు. తాజాగా ఆమెకు కరోనా నెగటీవ్ వచ్చినప్పటికీ ఊపిరితిత్తుల ఇన్ఫెక్షన్తో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. వరస ఘటనలతో కుటుంబ సభ్యులు తీవ్ర ద్రిగ్భాంతికి గురయ్యారు.
Next Story