Telugu Gateway
Cinema

ఎన్టీఆర్, రామ్ చరణ్ లకు అరుదైన గౌరవం

ఎన్టీఆర్, రామ్ చరణ్ లకు అరుదైన గౌరవం
X

ఆర్ఆర్ఆర్ సినిమాతో అంతర్జాతీయ హీరో లుగా మారిపోయారు ఎన్టీఆర్, రామ్ చరణ్, ఈ సినిమాలో వీళ్లిద్దరు తమ డాన్స్ తో దుమ్ము రేపిన నాటు నాటు పాటకు ఆస్కార్ అవార్డు రావటం తో వీరి క్రేజ్ కూడా మరింత పెరిగింది. ఎన్టీఆర్, రామ్ చరణ్ లతో పాటు ఆర్ఆర్ఆర్ సినిమాలోని కీలక సభ్యులకు అరుదైన గౌరవం దక్కింది. ప్రస్తుత సంవత్సరానికి అకాడమీ అవార్డ్స్ ఇచ్చే ఆస్కార్ కమిటీలో ఆర్ఆర్ఆర్ టీం సభ్యులకు ఆరుగురికి చోటు దక్కింది అందులో హీరో లు ఎన్టీఆర్, రామ్ చరణ్ తో పాటు సంగీత దర్శకుడు ఎం ఎం కీరవాణి, గీత రచయిత చంద్ర బోస్, ఛాయాగ్రాహకుడు సెంథిల్, ప్రొడక్షన్ డిజైనర్ సిరిల్ కు చోటు దక్కింది.

వీళ్ళతో పాటు ప్రముఖ దర్శకుడు మణి రత్నం, నిర్మాత కరణ్ జోహార్ లకు కూడా కమిటీ లో చోటు కల్పించారు. ఆస్కార్ వేడుక వచ్చే ఏడాది మార్చ్ 10 న జరగనుంది. తమ టీం సభ్యులకు ఆస్కార్ కమిటీ లో చోటు దక్కడంపై దర్శకుడు రాజమౌళి సోషల్ మీడియా వేదికగా స్పందించారు. ఎన్టీఆర్, రామ్ చరణ్ లతో పాటు ఇండియా నుంచి ఆస్కార్ కమిటీలో చోటు దక్కించుకున్న వారికి అయన అభినందనలు తెలిపారు.

Next Story
Share it