దుబాయ్ లో మహేష్ బాబు, త్రివిక్రమ్ భేటీ
BY Admin27 Dec 2021 10:54 AM GMT
X
Admin27 Dec 2021 10:54 AM GMT
చాలా గ్యాప్ తర్వాత ప్రముఖ దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్, మహేష్ బాబుల కాంబినేషన్ రిపీట్ కాబోతుంది. వీరిద్దరూ కలసి గతంలో ఖలేజా సినిమా చేసిన విషయం తెలిసిందే. మహేష్ బాబు 28వ సినిమా త్రివిక్రమ్ దర్శకత్వంలో తెరకెక్కనుంది. మోకాలికి శస్త్ర చికిత్స చేయించుకుని దుబాయ్ లో విశ్రాంతి తీసుకుంటున్నమహేష్ బాబుతో సోమవారం నాడు త్రివిక్రమ్ శ్రీనివాస్,నిర్మాత నాగవంశీ, మ్యూజిక్ డైరక్టర్ తమన్ లు భేటీ అయ్యారు. ఈ ఫోటోను షేర్ చేసిన మహేష్ బాబు అర్ధవంతమైన చర్చలతోపాటు చిల్ అయ్యామని పేర్కొన్నారు. మహేష్ బాబు సర్కారువారి పాట సినిమా షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ తర్వాత త్రివిక్రమ్ ప్రాజెక్టును ప్రారంభించే అవకాశం ఉంది..
Next Story