Telugu Gateway
Cinema

క‌రోనాతో ఆస్ప‌త్రిలో చేరిన క‌ట్ట‌ప్ప‌

క‌రోనాతో ఆస్ప‌త్రిలో చేరిన క‌ట్ట‌ప్ప‌
X

స‌త్య‌రాజ్. విల‌క్షణ న‌టుడు. క‌ట్ట‌ప్ప పాత్ర‌తో ఒక్క‌సారిగా దేశ‌వ్యాప్తంగా మ‌రింత పాపుల‌ర్ అయ్యారు. ఇప్పుడు క‌ట్ట‌ప్ప క‌రోనా బారిన ప‌డి ఆస్ప‌త్రిలో చేరారు. ఆయనకు కోవిడ్‌ పాజిటివ్‌గా తేలడంతో కుటుంబ సభ్యులు ఆయన్ను శుక్ర‌వారం సాయంత్రం చెన్న‌య్ లోని ఓ ఆసుపత్రిలో చేర్పించారు. తమిళనాడులో ఒమిక్రాన్‌తో పాటు కరోనా కొత్త కేసులు పెద్ద ఎత్తున వెలుగు చూస్తున్నాయి. దీంతో రాష్ట్రంలో నైట్ కర్ఫ్యూను అమలు చేస్తున్నారు. ఆదివారం నాడు లాక్‌డౌన్‌ను కూడా అమ‌లు చేస్తున్నారు. సినీ ప‌రిశ్ర‌మ‌కు చెందిన ప‌లువురు వ‌ర‌స‌గా ఈ వైర‌స్ బారిన ప‌డుతున్నారు. రెండు డోసుల వ్యాక్సినేష‌న్ పూర్తి చేసుకుని ప‌లు జాగ్ర‌త్త‌లు తీసుకుంటున్నా కూడా వైర‌స్ వ‌ద‌ల‌టం లేదు.

Next Story
Share it