Telugu Gateway
Politics

పుల్వామా దాడిపై కూడా రాజకీయం చేశారు

పుల్వామా దాడిపై కూడా రాజకీయం చేశారు
X

ప్రధాని నరేంద్రమోడీ విపక్షాలపై తీవ్ర విమర్శలు గుప్పించారు. సర్దార్ వల్లభాయ్ పటేల్ జయంతి సందర్భంగా ఆయన శనివారం నాడు వివిధ కార్యక్రమాల్లో పాల్గొన్నారు. పటేల్ కు నివాళి అర్పించిన అనంతరం మోడీ మాట్లాడారు. ఈ ఉగ్రదాడి సమయంలో కూడా ప్రతిపక్షాలు దారుణంగా వ్యవహరించాయని విమర్శించారు. దేశం తన బిడ్డలను కోల్పోయిన బాధలో ఉంటే.. కొందరు మాత్రం తమ స్వార్థం చూసుకున్నారని ఆరోపించారు. పుల్వామా దాడి గురించి పాకిస్తాన్‌ మంత్రి తమ పార్లమెంట్‌లో చేసిన ప్రకటనతో మన ప్రతిపక్షాల నిజస్వరూపం ఏంటో జనాలకు తెలిసిందని అన్నారు. సర్దార్‌ వల్లభాయ్‌ పటేల్‌ జయంతి సందర్భంగా గుజరాత్‌లోని కేవడియాలోని ఐక్యతా విగ్రహం వద్ద మోదీ నివాళులర్పించారు.

'ఈ రోజు ఇక్కడ పరేడ్‌ నిర్వహించిన అధికారులను చూస్తే.. నా మదిలో పుల్వామా దాడి ఘటన మెదిలింది. దేశం కోసం ప్రాణాలర్పించిన వీరుల త్యాగాలను ఎన్నటికి మరువం. దేశం బిడ్డలను కోల్పోయి బాధపడుతుంటే.. కొందరు మాత్రం స్వార్థపూరితంగా ప్రవర్తించారన్నారు. దేశ భద్రతను దృష్టిలో పెట్టుకుని ఇలాంటి రాజకీయాలు చేయకండి. ఉగ్రవాదంపై భారత్‌ నిరంతర పోరు సాగిస్తుందని, ఉగ్రవాదానికి వ్యతిరేకంగా ప్రపంచ దేశాలన్నీ ఏకమై పోరాడాలని పిలుపునిచ్చారు. ఉగ్రవాదం, హింసతో ఏ ఒక్కరూ ప్రయోజనం పొందలేరని పరోక్షంగా పాక్‌కు చురకలంటించారు. దేశం కోసం ప్రాణాలర్పించిన వీర సైనికుల త్యాగాలను దేశం ఎప్పటికీ మరువదని మోదీ పేర్కొన్నారు

Next Story
Share it