Telugu Gateway
Politics

అమిత్ షాకు మమత మరో షాక్

అమిత్ షాకు మమత మరో షాక్
X

బిజెపి అధ్యక్షుడు అమిత్ షాకు పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ మరోసారి షాక్ ఇచ్చారు. గతంలో ఓ సారి అమిత్ షా హెలికాప్టర్ ల్యాండింగ్ కు కూడా మమత సర్కారు నిరాకరించింది.అప్పట్లోనే ఈ సంఘటన పెద్ద దుమారం రేపింది. అయినా మమతా బెనర్జీ డోంట్ కేర్ అంటూనే ఉన్నారు. తాజాగా అమిత్ షా ర్యాలీకి నో అని చెప్పి కొత్త వివాదానికి తెరలేపారు. చివరి దశ ఎన్నికలు జరిగే ప్రాంతంలో అమిత్ షా సోమవారం ఎన్నికల ప్రచారం చేయాల్సి ఉంది. దీని కోసం జాధవ్ పూర్ ప్రాంతాన్ని ఎంచుకున్నారు. కానీ చివరి నిమిషంలో పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం అనుమతి ఇవ్వకపోవటంతో బిజెపి మండిపడుతోంది.

ఓ వైపు దేశంలోని విపక్షాలు అన్నీ ఎన్నికల కమిషన్ ప్రధాని మోడీ ఎలా చెపితే అలా నడుచుకుంటోందని విమర్శలు చేస్తుంటే...పశ్చిమ బెంగాల్ లో మాత్రం బిజెపి ఈసీపై ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. తృణమూల్ అప్రజాస్వామిక చర్యల పట్ల ఈసీ స్పందించకపోవటం దారుణం అని బిజెపి నేతలు వ్యాఖ్యానించారు. నిజంగా ఎన్నికల సమయంలో అందరికీ సమాన అవకాశాలు కల్పించాల్సి ఉంటుంది. మోడీపై విమర్శలు చేసే మమత కూడా అలాగే చేస్తున్నారనే విమర్శలు ఎదుర్కొంటున్నారు.

Next Story
Share it