ఒక్క డైలాగ్ లేకుండా ‘ఖామోషీ’ టీజర్
BY Telugu Gateway11 May 2019 3:31 AM GMT
X
Telugu Gateway11 May 2019 3:31 AM GMT
‘ఖామోషీ’ సినిమా టీజర్ వెరైటీగా ఉంది. ఇందులో ఒక్కటంటే ఒక్క డైలాగ్ కూడా లేదు. ఓన్లీ యాక్షన్ మాత్రమే. ప్రభుదేవా సైకోగా నటిస్తూ కన్పించిన వాళ్ళు అందరినీ చంపుతూ ఉంటాడు. ఆయన్ను చూసి తమన్నా భయపడుతూ ఉంటుంది. చక్రి తోలేటి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా టీజర్ ను చిత్ర యూనిట్ తాజాగా విడుదల చేసింది.
ఈ సినిమాకు సంబంధించి మరో విశేషం కూడా ఉంది. ప్రభాస్ ఇందులో ఓ అతిధి పాత్రలో నటించారు. డైలాగ్ లు లేకుండా ‘జాగ్రత్తగా ఉండండి. అతడికి ఒక్కసారి కనపడితే వదిలిపెట్టడు’ అనే హెచ్చరికలు చూపించారు టీజర్ లో. ఈ సినిమా మే 31న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.
https://www.youtube.com/watch?time_continue=3&v=T1SywUgGfzs
Next Story