Telugu Gateway
Politics

బిజెపికి ‘గాడ్సే’ చిక్కులు

బిజెపికి ‘గాడ్సే’ చిక్కులు
X

ఎన్నికల సమయంలో ‘గాడ్సే’పై ఆ పార్టీ నేతలు చేసిన వ్యాఖ్యలు బిజెపిని ఇరకాటంలోకి నెడుతున్నాయి. దీంతో ఏకంగా బిజెపి అధ్యక్షుడు అమిత్ షా రంగంలోకి దిగాల్సి వచ్చింది. పార్టీ నేతలు చేసిన వ్యాఖ్యలు వారి వ్యక్తిగతం అని..వాటికి బిజెపికి ఎలాంటి సంబంధంలేదని ప్రకటించారు. మహాత్మ గాంధీని చంపిన నాథూరాం గాడ్సేకు అనుకూలంగా ముగ్గురు బీజేపీ నేతలు చేసిన వ్యాఖ్యలు పెద్ద దుమారం రేపాయి. గాడ్సేపై బిజెపి నేతలు అనంత్‌ కుమార్‌ హెగ్డే, ప్రజ్ణా సింగ్‌ ఠాకూర్‌, నళినీ కుమార్‌ కతీల్‌లు చేసిన వ్యాఖ్యలు వారి వ్యక్తిగతమని, పార్టీ వైఖరితో వారి వ్యాఖ్యలకు సంబంధం లేదని అమిత్‌ షా శుక్రవారం ప్రకటించారు.

బీజేపీ సిద్ధాంతం, విధానాల ప్రాతిపదికన వారి వ్యాఖ్యలను తీవ్రంగా పరిగణిస్తున్నామని, వారి వ్యాఖ్యలపై వివరణ కోరతామని తెలిపారు. ఈ నేతలు ఇప్పటికే తమ వ్యాఖ్యలపై క్షమాపణలు కోరారని, అయితే వీరి వ్యాఖ్యలను పార్టీ క్రమశిక్షణా కమిటీకి నివేదించామని అమిత్‌ షా ట్వీట్‌ చేశారు. పది రోజుల్లో కమిటీ తన నివేదికను సమర్పిస్తుందని చెప్పారు. మహాత్మా గాంధీని చంపిన నాథూరాం గాడ్సే ఎన్నటికీ దేశభక్తుడేనని సాధ్వి ప్రజ్ఞా సింగ్‌ గురువారం చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపిన సంగతి తెలిసిందే.

Next Story
Share it