Telugu Gateway
Latest News

ఇండియా వరల్డ్ కప్ క్రికెట్ టీమ్ ఇదే

ఇండియా వరల్డ్ కప్ క్రికెట్ టీమ్ ఇదే
X

అత్యంత ప్రతిష్టాత్మకమైన క్రికెట్ ప్రపంచ కప్ బరిలో నిలిచే భారత్ జట్టును సెలక్షన్ కమిటీ ప్రకటించింది. విరాట్ కొహ్లి సారధ్యంలోనే భారత్ ప్రపంచ కప్ బరిలో నిలవనుంది. వైఎస్ కెప్టెన్ గా రోహిత్ శర్మకు అవకాశం కల్పించారు. జట్టులో చోటు దక్కించుకున్న వారిలో శిఖర్ ధావన్, కె ఎల్ రాహుల్, విజయ్ శంకర్, ఎం ఎస్ ధోనీ, కేదార్ జాదవ్, దినేష్ కార్తీక్, యుజువేంద్ర చాహల్, కుల్దీప్ యాదవ్, భువనేశ్వర్ కుమార్, జస్ప్రీత్ బుమ్రా, హార్ధిక్ పాండ్యా, రవీంద్ర జడేజా, మొహమ్మద్ షమీలు ఉన్నారు. రిషబ్ పంత్, తెలుగువాడు అయిన అంబటి రాయుడులకు ప్రపంచ కప్ జట్టులో చోటు దక్కలేదు.

అత్యంత ఉత్కంఠ భరితంగా సాగే ప్రపంచ కప్ క్రికెట్ టోర్నమెంట్ మే 30న ప్రారంభం అయి..జూలై 14 వరకూ కొనసాగనుంది. మొత్తం 48 మ్యాచ్ లు ఉంటాయి. తొలి మ్యాచ్ లండన్ లోని ఓవల్ లో జరగనుంది. ప్రతి క్రికెటర్ జీవితంలో ఒక్కసారైనా ప్రపంచ కప్ టీమ్ లో చోటు దక్కితే చాలు అని కోరుకుంటారు. అయితే ఎక్కువ శాతం ఆటగాళ్ళ ఫామ్ ను దృష్టిలో పెట్టుకుని బోర్డు నిర్ణయం తీసుకుంటుంది. మొత్తం 15 మంది సభ్యులతో టీమ్ ను ప్రకటించారు.

Next Story
Share it