ఎయిర్ ఇండియా విమానంలో మంటలు
BY Telugu Gateway25 April 2019 5:22 AM GMT
X
Telugu Gateway25 April 2019 5:22 AM GMT
అది ఢిల్లీ విమానాశ్రయం ఎయిర్ ఇండియా బోయింగ్ విమానం ఎగరటానికి రెడీ అవుతోంది. ఆ సమమయంలో జరిగే తనిఖీల సమయంలో ఒక్కసారిగా మంటలు. అంతే విమానాశ్రయంలో కలకలం రేగింది. వెంటనే ఫైర్ ఇంజన్లు రంగంలోకి దిగి మంటలను ఆర్పాయి. దీంతో ఎలాంటి ప్రమాదం చోటుచేసుకోలేదు. ఢిల్లీ విమానాశ్రయంలోని న్యూఢిల్లీ-శాన్ఫ్రాన్సిస్కో బోయింగ్ 777 విమానంలో అకస్మాత్తుగా మంటలు వ్యాపించాయి. అయితే ఈ ఘటనపై స్పందించిన ఎయిరిండియా ఎయిర్ ఇండియా బోయింగ్ 777 లోని ఏసీ మరమ్మత్తు సందర్భంగా మంటలొచ్చాయని, వెంటనే వాటిని అదుపు చేసినట్టు తెలిపింది. ఆ సమయంలో విమానంలో ఎవరూ లేకపోవటంతో ఎలాంటి ప్రమాదం చోటుచేసుకోలేదు.
Next Story