Telugu Gateway
Politics

కెసీఆర్ కు హైకోర్టు నోటీసులు

కెసీఆర్ కు హైకోర్టు నోటీసులు
X

లోక్ స‌భ ఎన్నిక‌ల ముందు కీల‌క ప‌రిణామం. ఓ ఎన్నిక‌ల కేసుకు సంబంధించి తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌కు హైకోర్టు నోటీసులు జారీ చేసింది. అసెంబ్లీ ఎన్నికల్లో గజ్వేల్‌ నియోజకవర్గం నుంచి గెలిచిన కేసీఆర్‌ ఎన్నికల అఫిడవిట్‌లో తప్పుడు సమాచారం ఇచ్చారనే అంశంపై హైకోర్టులో ఫిటిషన్‌ దాఖలైంది. కేసీఆర్‌పై 64 క్రిమినల్‌ కేసులు ఉంటే మొదటి అఫిడవిట్‌లో కేవలం 4 కేసులు మాత్రమే చూపారని పిటీషన్‌‌లో పేర్కొన్నారు.

గజ్వేల్‌ కు చెందిన శ్రీనివాస్‌ అనే ఓటర్‌ ఈ పిటిషన్‌ దాఖలు చేశారు. తప్పుడు అఫిడవిట్ దాఖలు చేసిన కేసీఆర్‌ను ఎమ్మెల్యే‌గా అనర్హుడు‌గా ప్రకటించాలని ఆయ‌న కోరారు. ఈ పిటిషన్‌ను విచారణకు స్వీకరించిన హైకోర్టు.. కేసీఆర్‌కు, ఎన్నికల రిటర్నింగ్ అధికారులకు నోటీసులు జారీ చేసింది. 4 వారాల్లో వివరణ ఇవ్వాలని ప్రతివాదులకు హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. తదుపరి విచారణను నాలుగు వారాలకు వాయిదా వేసింది.

Next Story
Share it